China Not Real Exasperate to India for War

China back step in doklam issue

China praise Modi, China Back Step Doklam, Doklam Issue, China India America, America Provoke India War, Doklam America Support India, India China War America

Amid Sikkim Standoff, Praise For PM Modi, GST By Chinese State-Run Media. China says India's troops have entered its territory to stop its army from building a road. India and Bhutan say the road is being built on Bhutanese soil. America Try to Interfere in India America Trade issues Media alleges.

మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

Posted: 07/27/2017 09:50 AM IST
China back step in doklam issue

భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది. ఇందుకోసం అక్కడి మీడియా మాధ్యమాలు అన్నిరకాలుగా సాయం చేశాయ్ కూడా. పైగా చైనా మాట విని వెనక్కి తగ్గకపోతే కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటామని, యుద్ధం కూడా తప్పకపోవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.

అయితే బలం తక్కువగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం 'దేనికైనా సై' అంటూ అంతే స్థాయిలో బదులిచ్చింది. సరిహద్దులో సైన్యం పాగా వేసి దూకుడు చూపించింది. ఇంతలో అగ్రరాజ్యం అమెరికా మనకు మద్ధతుగా నిలిచింది. దీంతో నిన్నటి దాకా కారు కూతలు కూసిన చైనా హఠాత్తుగా స్వరం మార్చింది. భారత్ తులనాడిన అదే మీడియా ఇప్పుడు పొగుడుతూ కథనాలు రాస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించింది. జీఎస్టీ, తదితర నిర్ణయాలతో వాణిజ్య రంగాన్ని మోదీ పరుగులు పెట్టిస్తున్నారంటూ పేర్కొన్న గ్లోబల్ టైమ్స్ భారత ప్రభుత్వం అమలు చేస్తున్న బహిరంగ విదేశీ ఆర్థిక విధానాన్ని ప్రశంసించింది.

విదేశీ పెట్టుబడులను భారత్ అత్యధిక స్థాయిలో ఆకర్షిస్తోందని... పెట్టుబడులకు దేశాన్ని అనుకూలంగా మార్చిందని కితాబిచ్చింది. ఇక గత రెండేళ్లుగా విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గధామంలా మారిందని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ నాయకత్వంలో క్రియాశీల విదేశాంగ విధానం అమలవుతోందని కితాబిచ్చింది. భారత్-చైనాల మధ్య బహిరంగ వాణిజ్య విధానం, వాణిజ్య సహకారాన్ని పెంపొందిస్తే... ప్రపంచంలోని స్వీయ సంరక్షణ విధానాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడింది. అయితే, సరిహద్దు అంశాన్ని సాకుగా చేసుకుని అమెరికా భారత్ ను రెచ్చగొడుతూ.. ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందంటూ మండిపడింది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక స్వీయ సంరక్షణ విధానాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాలను తొక్కిపడేయాలని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China Media  India  America  Doklam Issue  

Other Articles