కావులకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని.. ఈ క్రమంలో చట్టాన్ని అతిక్రమించి పాదయాత్రలో పాల్గోనే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. పాదయాత్రలో ఎవరు పాల్గొనకూడదని ఆయన సూచించారు. పాదయాత్ర పేరుతోనో.. మరో పేరుతోనో ప్రభత్వ అస్తులు, ప్రైవేటు అస్తులపై విధ్వంసానికి పాల్పడితే చట్టపరంగా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
డీజీపీ మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏదైనా ర్యాలీ చేయాలంటే పోలీసు అధికారుల పర్మిషన్ తీసుకోవాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా బాధ్యత తీసుకుంటామని ఒకరు హామీ ఇస్తేనే పర్మిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు 2009లో ప్రతి రాష్ట్రానికి గైడ్ లైన్స్ జారీ చేసిందని తెలిపారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30, సెక్షన్ 144 లు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేది లేదని, అలాగే వెనకడుగు వేసేది లేదన్నారు.
కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని, గత ఏడాది ముద్రగడ పాదయాత్రలోనూ 60 నుంచి 70 కోట్ల రూపాయల అస్తులకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. చట్టం పట్ల గౌరవం లేకుంటే అందరికీ నష్టం జరుగుతుందన్నారు.
మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో.. సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా ముద్రగడ ఇచ్చిన పిలుపుకు స్పందించి కాపులు రాజధాని అమరావతికి చేరకుంటారన్న టెన్షన్ మాత్రం పోలీసు అధికారుల్లో కనిపిస్తుంది. దీంతో రాజధానికి చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధం చేశారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని నెరవేర్చాలని ముద్రగడ పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more