అమె అసాధారణ నాయకురాలు. బీజేపిలోని ఎందరో మహిళా నేతలు వున్నా.. కేంద్ర మంత్రి పదవులలో కొనసాగుతున్నా.. వారందరినీ ఈమెతో పోల్చలేము. అనారోగ్యం బారిన పడినా.. అమె తన మంత్రిత్వ శాఖకు చెందిన సేవలకు మాత్రం అంతరాయం కలగకుండా జాగ్రత్తపడుతూ.. ఎప్పటికప్పుడు బాధితుల పక్షాన నిలిచి వారికి ఆపన్నహస్తం అందించారు. అమె మరోవరో కాదు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను పార్లమెంటులో వినిపించి.. తెలంగాణ ప్రజల మనస్సులను కొల్లగొట్టిన చిన్నమ్మ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పెద్దమ్మ సోనియాతో పాటు ఆ ప్రాంత ప్రజల వాంఛపై గొంతును వినిపించిన ఈ చిన్నమ్మను కూడా మర్చిపోవద్దని అమె చేసిన అభ్యర్థనతో అమెను తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నారు.
ఆయితే ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరడంతో.. 2014 నుంచి అమె భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే అమె అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరి మన్నన్నలు పోందుతూ అత్యుత్తమంగా ఆరాధిస్తున్న రాజకీయ నేతగా అవతరించారని ఏకంగా అమెరికాకు చెందిన ది వాల్ స్ట్రీట్ పత్రిక ఎడిటోరియల్ వ్యాసాన్ని ప్రచురిస్తూ అభివర్ణించింది. యావత్ దేశంలోనే అమె మేటి రాజకీయ నేతగా కొనియాడింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు అమె నిజంగా తన మాతృత్వ ప్రేమను చాటుతున్నారని అభివర్ణించింది. దీంతో సుస్మా స్వరాజ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది.
ఇబ్బందుల్లో చిక్కకున్న భారతీయుల కోసం అమె అహర్నిశలు కష్టపడుతున్నారని, అదే అమెను మేటి నాయకురాలిగా అవతరించేందుకు దోహదం చేశాయన్నారు. సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ఖాతాను 8.69 మిలియన్ల మంది ఫాలో అవుతన్నారని.. అమె ఇప్పటి వరకు చేసిన ట్విట్లలో అనేకం బాధితులు అమెకు అర్థిస్తూ చేస్తున్న వాటికి సమాధానంగా చేసినవేనని వ్యాసం పేర్కోనింది. హోవర్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టాండ్ ఫర్డ్ ఫెలోషిఫ్ వున్న టుంకూ వరదరాజన్ అనే వ్యాసాకర్త తన వ్యాసంలో మరెన్నో విషయాలను పేర్కోన్నారు.
ధాయాధి దేశం పాకిస్థాన్ తో నిత్యం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నా.. అమె మాత్రం తన మాతృత్వపు మమకారాన్ని చాటుతూ అపదలో వున్నాము కరుణించండీ అన్న పాకిస్తానీయులకు కూడా అపన్నహస్తాన్ని అందిస్తున్నారని పలు సంఘటలనలలో అమె చేసిన ట్విట్లతో పాటు భాధితులుతమదేవానికి తిరిగివెళ్లిన తరువాత చేసిన ట్విట్లను కూడా పొందపర్చుతూ ఇలాంటి నేతలు అత్యంత అరుదుగా వుంటారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more