దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిథారీ సీరియల్ మర్డర్ల కేసులో వ్యాపారవేత్త వ్యాపారవేత్త మొనీందర్ సింగ్ పాంధర్, అతని ఇంట్లో పనిమనిషి సురీందర్ కోలీలకు సీబీఐ ప్రత్యేక కోర్టు మరణదండన విధించింది. వీరిద్దరూ కలసి పింకీ సర్కార్ ను హత్య చేశారన్న అభియోగాలపై విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని నిర్థారించి ఇద్దరినీ దోషులుగా తేల్చింది. ఈ మేరకు ఇవాళ ఈ నిథారీ సిరియల్ మర్డర్ల విషయమై తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఫాంథర్ తో పాటుగా అతని మరణదండన విధిస్తూ తీర్పును వెలువరించింది.
తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా న్యాయస్థానం ఈ కేసు అత్యంత అరుదైనదని అభిప్రాయపడ్డ పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పవన్ కుమార్ తివారీ తుది తీర్పును వెలువరిస్తూ.. అత్యంత క్రూరారంగా యువతులను హత్య చేసిన వీరిద్దరు దోషులు జీవించే అర్హతను కోల్పోయారని వ్యాఖ్యానించారు. యువతిని కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారం, హత్య ఆరోపణలన్నీ వీరిపై రుజువయ్యాయని తెలిపారు. ఈ కేసులో పనిమనిషి కోలికి.. విధుల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న పింకీ సర్కార్ ను ఇంట్లోకి పిలిచి ఆ తరువాత అమెను అక్టోబర్ 5, 2006లో హత్యచేశారని తమ దర్యప్తులో అంగీకరించినట్లు సిబిఐ తమ చార్జిషీటులో పేర్కొనింది.
కాగా, ఈ కేసులో దర్యాప్తులో భాగంగా డిసెంబర్ 29, 2006న నోయిడా సమీపంలోని నిథారీ ఇంటిని సోదా చేసిన అధికారులకు.. అతని ఇంటి వెనుకభాగంలోని పెరట్లో 19 అస్థి పంజరాలు బయటపడి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు 19 కేసులను నమోదు చేయగా, వాటిల్లో 16 కేసుల్లో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా మూడు కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో వాటిని కొట్టేయాల్సి వచ్చింది. 19 అస్థి పంజరాల్లో అత్యధికం, ఆ ప్రాంతంలో అదృశ్యమైన యువతులవే కావడంతో, పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పింకీ సర్కార్ కేసులో పక్కా సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more