వయోవృద్ధులకు కేంద్రం వందనం చేస్తుంది. అవునండీ నిజంగా.. జీవిత చరమాంకంలో వారు అర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా వుండేందుకు వయో వందన పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని కేవలం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ప్రవేవపెట్టింది. ఈ పెన్షన్ పథకాన్ని ఎల్ఐసీ అమలుచేస్తోంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దీన్ని తీసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పదేళ్ల పాటు 8 శాతం వడ్డీ చెల్లింపులకు హామీ ఉంటుంది.
ఈ పథకంలో చేరిన వయోవృద్దులకు నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ కావాలంటే రూ.1.5 లక్షలు, గరిష్ఠంగా రూ.5,000 పెన్షన్ కావాలంటే రూ.7.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 60ఏళ్లు నిండిన ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఏడాది మే 4న ప్రారంభమైన ఈ పెన్షన్ పథకంలో వచ్చే ఏడాది మే 3వ తేదీ వరకు చేరవచ్చు. ఇతర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వయె వందనం పథకం మీద ఏటా 8.3 శాతం వడ్డీ గిట్టుబాటవుతుంది.
ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు నెల, 3 నెలలు, 6 నెలలు లేదా ఏడాదికి ఒకసారి పెన్షన్ అందుకోవచ్చు. పథకంలో చేరేటపుడే ఈ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఈ పథకానికి జీఎస్టీ వర్తించదు. పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిలో 75 శాతం మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. పదేళ్ల కాలపరిమితి మధ్యలోనే పెన్షనర్ లేదా వారి జీవిత భాగస్వామి తీవ్రమైన వ్యాధుల బారిన పడితే పెట్టిన పెట్టుబడిలో 98 శాతం తిరిగి చెల్లిస్తారు. పదేళ్ల కాలం పూర్తిగా ముగిసిపోయి… అప్పటివరకు అసలు మొత్తం లోంచి ఏమీ తీసుకోకపోతే ముందుగా ఎంత మొత్తం పెట్టి కొనుగోలు చేశారో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more