అధికారం వంకతో అడ్డమైన పనులు చేయించుకునే నేతలు ఉన్న ఈరోజుల్లో వాళ్ల వారసులు పేరును ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. చెట్టు పేరు చెప్పుకుని ఎదిగేందుకు ప్రయత్నించే తరుణంలో ఇక్కడో నేత కుమార్తె వ్యవహారం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. భారతదేశ 14వ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి వ్యవహారశైలి ఓసారి పరిశీలిద్దాం.
స్వాతి కోవింద్ ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తోంది. ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే ఎయిరిండియా బోయింగ్ 777,787 విమానాల్లో ఆమె ఎయిర్ హెస్టెస్ గా చక్కర్లు కొడుతూ కనిపిస్తుంది. అయితే ఏనాడూ ఆయన తన తండ్రి అని చెప్పుకోలేదు. కోవింద్ బీహార్ గవర్నర్ గా ఉన్న సమయంలో కూడా ఆమె పేరు బయటికి రాలేదు. రాష్ట్రపతి గా ఎన్నికైన తర్వాత ఆమె వివరాలు ప్రచురించగా.. తోటి సిబ్బంది అది చూసి షాక్ తిన్నారంట.
అంత స్థాయి నేత కూతురైనా ఏనాడు స్వాతి గొప్పలు చెప్పుకోలేదు. పైగా కార్యాలయంలోని అధికారిక పత్రాల్లో కూడా ఆమె తన ఇంటి పేరు చేర్చలేదు. తన తండ్రి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న సమయంలో ఆమె ప్రత్యేక సెలవుపై వెళ్లారు. సెలవుకు గల కారణాన్ని ఆమె వివరించలేదు. అంతెందుకు గురువారం వరకు ఆమె రాష్ట్రపతి రామ్ నాథ్ కుమార్తె అన్న సంగతి ఎయిర్ ఇండియాకు తెలియకపోవడం విశేషం.
ప్రత్యేక సెలవుకు గల కారణాన్ని వివరించే క్రమంలో ఆమె రాష్ట్రపతి కుమార్తె అన్న విషయం ఎయిరిండియాకు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. ఆమెప్పుడూ సాధారణ ఉద్యోగిలానే వ్యవహరించారే తప్ప ఏ రోజూ గొప్పలకు పోలేదని ఆమె సహోద్యోగిని తెలిపారు. తల్లి పేరును సవిత అని, తండ్రి పేరును ఆర్ఎన్ కోవింద్ అని పేర్కొన్న ఆమె... తమ సహోద్యోగి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నామని ఎయిరిండియా సిబ్బంది చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more