తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సంస్థ సరికొత్త ఆఫర్ తో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతిభ పేరుతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ముందుకు వచ్చిన ఈ పథకంలో నీట్, ఎంసెట్ సహా ఇతర పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్థులు.. వారి ర్యాంక్ కార్డు అధారంగా ప్రతిభ ప్రీ పెయిడ్ పథకంలో చేరే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆఫర్ ఈ నెల 15 నుంచి 90 రోజుల పాటు కొనసాగనుంది. అయితే విద్యార్థులు తమ వ్యాలిడిటీని పెంచుకోవాలని బావించిన పక్షంలో కేవలం రూ. 49 తో రీచార్జ్ చేస్తే 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
విద్యర్థులు మైనర్లన పక్షంలో వారి తల్లిదండ్రులు పేరుపై ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. అందుకు తల్లిదండ్రుల గుర్తింపు, అడ్రస్ ఫ్రూఫ్ లను తీసుకోనున్నారు. దీంతో వీరికి ఏదేని ఒక మొబైల్ నెంబరుతో లేదా ల్యాండ్ లైన్ నెంబరుకు అన్ లిమిటెడ్ టాక్ టైమ్ కల్పించనున్నారు. ఈ పథకంలో చేరగానే విద్యార్థులకు రూ 20 ఉచిత టాక్ టైమ్ లభిస్తుంది. దీంతో పాటు సెకనుకు పైసా కాల్ పల్స్ రేట్ చోప్పున వీరు ఏ మొబైల్ కైనా కాల్ చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నారు.
దఅంతేకాకుండా 3 జీబి డాటా కూడా లభిస్తుంది. ఇక ఈ డేటా కూడా నెల రోజుల వ్యాలీడిటీతో లభ్యం కానుంది. వీటితో పాటు విద్యార్థులు లోక్ల్, నేషనల్ ఎస్ఎంఎస్ లు పంపుకునేందుకు గాను నెలకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పంపే సదుపాయం కూడా కల్పించింది బీఎస్ఎన్ఎల్. కాగా ఈ పథకంలోకి ఇతర బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు చేరే వెసలుబాటును మాత్రం కల్పించలేదు. అయితే ఉచిత అన్ లిమిటెడ్ కాల్ చేసుకునే నెంబరును మార్చుకున్న పక్షంలో మాత్రం రూ.10 చార్జీగా వసూలు చేస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. మరిన్ని వివరాలకు 1503, 18001801503 టోల్ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more