భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన దేశంలో కన్నా అధికంగా విదేశాల్లోనే పర్యటిస్తున్నారన్న మొదట్లో అరోపించిన కాంగ్రెస్ తాజాగా అయన చేసే పర్యటలతో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని కూడా అరోపణలు గుప్పించింది. తాజాగా ప్రధాని విదేశీయానాలన్నీ దేశ ప్రజలకు టీవీల్లో చూపించడానికి తప్ప మరెందుకు ఉపయుక్తం కావడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మకెన్ విమర్శించారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల వ్యవధిలో 64 విదేశీ పర్యటనలు చేశారని కూడా ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలను దేశప్రజలకు చూపడంలో వున్న ఆసక్తి.. దేశానికి లాభం చేకూర్చే విషయంలో మాత్రం కానరాలేదని దుయ్యబట్టారు.
ఈ క్రమంలో ప్రధాని విదేశీ పర్యటనలపై ఓ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటీషన్ ను ప్రధానమంత్రి కార్యాలయం నిద్వందంగా తోసిపుచ్చింది. ప్రధాని హోదాలో ఎవరు పర్యటనలు జరిపినా అవి దేశ సంక్షేమం కోసమేనని.. తెలిసో, లేక తెలియకో కానీ ఈ పిటీషన్ దాఖలైంది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ఇవ్వడం కుదరదని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా వీరి విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు తెలియజేయాలని సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద గత జూన్ 16న దరఖాస్తు చేశారు.
అయితే ఈ పిటిషన్ అర్థం లేనిదని ప్రధానిల ఖర్చుల వివరాలు ఇవ్వలేమని పీఎంవో కేంద్ర సమాచార అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రధానుల పర్యటనల గురించి పీఎంఓ, ఇతర శాఖలను ఫైళ్ల కాపీలు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. ఆర్టీఐ సెక్షన్ 19 ప్రకారం సౌత్ బ్లాక్ లో ఉన్న అప్పిలేట్ అథారిటీ సయ్యద్ ఇక్రం రిజ్విని సంప్రదించాల్సిందిగా ప్రవీణ్ కుమార్ సూచించారని నూతన్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more