రాను రాను సంచలనంగా మారుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. మెల్లిగా ఇది రాజకీయాంశంగా మారుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు చేపడుతున్న ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పదకొండు రోజులు వ్యక్తిగత సెలవులు తీసుకున్నట్లు తెలిపాడు. దీనిపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడు.
ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించేందుకు ఆయనను సెలవుపై పంపిస్తున్నారని విమర్శించారు. విచారణ ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఆయన సెలవుపై వెళుతుండటం వెనుక ఒత్తిళ్లే కారణమని చెప్పాడు. విచారణ పారదర్శకంగా జరుగుతున్న సమయంలో ఇలాంటివి కేసును పక్కదోవ పట్టించే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నాడు. మరోపక్క పలువురు రాజకీయ నేతల పిల్లలు, వ్యాపారవేత్తల వారసులు కూడా ఇందులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే జాబితాలోని మిగతా పేర్లు వెల్లడించకూడదనే అధికారులు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
అయితే డ్రగ్స్ కేసుకు, తన సెలవులకు సంబంధం లేదని అకున్ సబర్వాల్ వ్యాఖ్యానించారు. ఎల్లుండి నుంచి ఈ నెల 27వరకు తాను సెలవులపై వెళ్తున్నట్లు చెప్పారు. తన తల్లి మరణం అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రెండు నెలల క్రితమే తాను లీవ్ దరఖాస్తు చేసినట్లు వివరించాడు. తన వ్యక్తిగత పనులపైనే ఈ సెలవులు తీసుకున్నానని వెల్లడించారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని... ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహాయసహకారాలు ఉన్నాయని, మీడియా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అకున్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more