నడిచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఆరేడు గంటలు పడుతుండటంతో వారాంతాల్లో దివ్యదర్శనాన్ని ఇప్పటికే రద్దు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాలి నడక మార్గంలో ఎంత మంది భక్తులు వచ్చినప్పటికీ రోజుకు 20 వేల మందికి మాత్రమే దర్శన సమయాన్ని కేటాయించాలని నిర్ణయించింది.
ఈ మేరకు 17వ తేదీ సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు మీడియాకు తెలియజేశాడు. రోజుకు 20 వేల మందికి గరిష్ఠంగా దర్శనం లభించేలా చూస్తామని అన్నారు. ఇందుకోసం టైం స్లాట్ లను నిర్ణయిస్తామని, రెండున్నర గంటల్లో దర్శనానికి పంపుతామని వెల్లడించారు. వారంతంలో కాలిబాల దర్శనం రద్దు చేయటంతో ఆ మూడురోజుల్లో నడిచివచ్చిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం, లడ్డూ టోకెన్లు జారీ చేయరు.
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రూ.300 టికెట్ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు 2500 మంది భక్తులకు కేటాయించి సజావుగా శ్రీవారి దర్శనం కేటాయిస్తున్నారు. అదే తరహాలోనే రోజులో 20వేల మంది కాలిబాట భక్తులకు టైం స్లాట్ కేటాయించనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగటంతో అదుపు చేయటం కష్టతరమౌతోందని టీటీడీ భావిస్తూ వస్తోంది. ఉత్సవ వేళలో 50,000 మందికి పైగా, వారాంతంలో 40,000, మాములు రోజుల్లనూ 30000 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more