Highly Explosive Found in UP Assembly

Explosive found in up assembly mobiles banned

Uttar Pradesh Assembly, Terror Conspiracy, Assembly Bomb, Explosive Powder Assembly, MLA Seat Bomb, NIA Uttar Pradesh, UP Assembly Blast Plan, Assembly Blast Terrorists, UP Security Weak, Yogi Assembly Blast

Explosive found in Uttar Pradesh Assembly. Chief Minister Yogi Adityanath claims Terror Conspiracy and seeks NIA probe.

అసెంబ్లీలో బాంబు.. మొబైల్స్ బ్యాన్

Posted: 07/14/2017 01:00 PM IST
Explosive found in up assembly mobiles banned

అసెంబ్లీలో అది కూడా ఎమ్మెల్యే సీటు కిందే బాంబు లభించటంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ స్పందించాడు.ఇది ముమ్మాటికీ ఉగ్ర కుట్రే అని ప్రకటించిన యోగి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నాడని ఒప్పేసుకున్నాడు. దేశ అత్యున్నత ఉగ్రవాద నిర్మూలన విచారణ సంస్థ ఎన్ ఐఏ తో దర్యాప్తునకు ఆదేశించాడు. విద్రోహ చర్య వెనకాల ఉన్న నిందితులను కటకటాల వెనక్కి పంపాల్సిందేనంటూ పిలుపునిచ్చాడు.

యూపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన తనీఖీల్లో ఓ ఎమ్మెల్యే కుర్చీ కింద పౌడర్ లాంటి పదార్థం లభించింది. ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపగా పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అనే శక్తివంతమైన ప్లాస్టిక్‌ పేలుడుపదార్థంగా గుర్తించారు. 60 గ్రాములే అయినప్పటికీ దాని ప్రభావం చాలా దారుణంగా ఉండేదని నివేదికలో వెల్లడైంది. దీంతో దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీలో పేలుడుకు కుట్ర పన్నటంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు

ఇది 22 కోట్ల యూపీ ప్రజల సెంటిమెంట్ కు సంబంధించింది. కుట్ర వెనుక ఉందెవరో వెలుగులోకి తీసుకొస్తామని సీఎం యోగి ప్రకటించాడు. ఇకపై ప్రతినిధులతో మొబైల్ తో లోపలికి రావటం బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ప్రతీ గేట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసి పాస్ లు ఉన్నవారినే లోపలికి అనుమతించాలని పేర్కొన్నాడు. అయితే అసెంబ్లీ పేలుడుకే కుట్ర జరిగిందంటే లా అండ్ ఆర్టర్ ఎంత దయనీయంగా ఉందోనంటూ సమాజ్ వాదీ పార్టీ విమర్శలకు దిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Assembly  Explosive Found  

Other Articles