అయినవారికి అకుల్లోనూ కానీ వారికి కంచాల్లోనూ అన్న నానుడి గుర్తుందా..? సరిగ్గా ఇదే నానుడిని అసుసరిస్తుంది భారత్ రైల్వే శాఖ. నిత్యం లక్షలాధి మందిని అత్యంత చౌక ధరకు వార్వారి గమ్యస్థానాలకు చేర్చుతూ.. లాభాలను అర్జిస్తున్న రైల్వే శాఖ.. మనవారికి ఒక విధమైన ముందస్తు రిజర్వేషన్ పద్దతిని అమలు పరుస్తూ.. విదేశాలలో స్థిరనివాసాలు ఏర్పర్చుకుని స్వదేశీ పర్యటనకు వచ్చేవారికి.. వీరితో పాట భారత పర్యటనకు వచ్చే విదేశీ పర్యాటకులకు మాత్రం మరో విధమైన పద్దతిని అవలంభిస్తుంది.
సాధారణంగా దేశీయ ప్రయాణికులు రైల్వేలో ప్రయాణించాలంటే మూడు నెలల ముందు వరకే రైల్వే రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఉంది. అయితే దేశంలో పర్యటించాలనుకునే విదేశీ పర్యాటకులకుమాత్రం ఏడాది ముందుగానే రైలు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వారికి ఈ సుదుపాయాన్ని కల్పించే పనిలో భారత రైల్వే శాఖ నిమగ్నమైంది. మరో వారంలో ఇందుకు సంబంధించిన ప్రకటనను రైల్వేశాఖ వెలువరించనుంది. విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు రైల్వే ఈ మేరకు కొత్త సుదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
అయితే వీరికి అన్ని సీట్లు అందుబాటులో మాత్రం వుంచని రైల్వేశాఖ.. ఒక మెలిక మాత్రం పెట్టనుంది. వీరు కేవలం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజధాని, శతాబ్ధి, గతిమాన్, తేజస్ రైళ్లలో 360 రోజుల ముందుగానే టికెట్లు అందుబాటులో ఉంచుతారు. వీరు థర్డ్ ఏసీ, సెకండ్ స్లీపర్ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం లేదు. చివరి నిమిషంలో జర్నీ చేయాలనుకునే వారు ప్రత్యేక రైళ్లలో టికెట్లను బుక్ చేసుకోలేరు.
అయితే భారత రైల్వే శాఖ ఇటీవల టిక్కెట్ల కాన్సిలేషన్ ద్వారా గత ఏడాది 1470 కోట్ల రూపాయలను అర్జించిన నేపథ్యంలో ఈ అదాయంతో పాటు సర్వసాధారణంగా అన్ని ప్రయాణాల్లో ఖాళీగా కనిపించే సిట్లను భర్తీ చేసి అధికాదాయాన్ని సమకూర్చుకునే పనిలో భారత రైల్వే శాఖ నిమగ్నమైందన్న వార్తులు వినిపిస్తున్నాయి. విదేశీ పర్యటకులకు, ప్రవాస భారతీయులకు కూడా సాధారణ ప్రయాణికులకు మధ్య ఒక్క విషయంలో మాత్రం సమన్యాయం చేసింది రైల్వే శాఖ. అదే కాన్సిలేషన్ అప్ టిక్కెట్. ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకన్న పక్షంలో అందరి మాదిరిగానే 50శాతం మినహాయించుకుని మిగిలిని 50 శాతాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more