రోజుకో మలుపు తిరుగుతున్న బ్యూటీషియన్ శిరీష కేసులో అసలేం జరిగిందన్న ఉత్కంఠ పెరుగుతుంది. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జీ స్టూడియోలో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తమ వద్దకు చేరిన నివేదికల అధారంగా చెబుతున్న అమె బంధువులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అమెను హత్య చేశారని అరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.
తన మేనకోడలిని హత్య చేసిన వారిని తప్పించడానికి అమెపై తప్పుడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని ఆమె మేనమామ తీవ్ర ఆరోపణలు చేశారు. తన మేనకోడలిని కారులో తీసుకొచ్చేటప్పుడే హతమార్చారని అనుమానం వ్యక్తం చేశారు. మెడకు వైరు బిగించి ఆమెను హత్య చేశారని అరోపించిన ఆయన అందుకు సంబంధించి అధారాలు వున్నాయని కూడా చెప్పారు. శిరీష మెడపై వైరు చారిక ఉందని ఆయన చెప్పారు.
అంతే కాకుండా మీడియా చూపిస్తున్న ఫోటోలలో ఆమె షర్టు గుండీలు కూడా వరుస క్రమంలో కాకుండా అపక్రమంలో పెట్టినట్టున్నాయని అన్నారు. మీడియా చూపించిన ఫోటోలలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని.. కావాలంటే పోలీసులు మరోమారు వాటిని చూడాలని ఆయన సూచించారు. కింది బటన్ ను పై బొత్తంలో పెట్టారని ఆయన తెలిపారు. పెనుగులాటలో పైబటన్ తెగిపోయి ఉంటుందని, అందుకే ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే తొందరలో ఆమె బటన్స్ పెట్టారని.. అయన అరోపించారు.
కాగా శిరీష ఆత్మహత్య కేసులో అనవసర విమర్శలు చేయవద్దని డీసీపీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్ కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు. ఆమె బంధువులు మీడియా ముందు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన, తమకు ఎవరినీ కాపాడాలన్న ఉద్దేశం గానీ, అవసరం గానీ తమకు లేదనిఅన్నారు. శిరీష పంపిన వాట్స్ యాప్ లొలేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతే తెలుస్తుందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more