రవాణా శాఖ అధికారిపై దాడి, ఆపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో క్లాస్ పీకించుకోవటం, తన ట్రావెల్స్ కు జరిగిన డ్యామేజ్, బీజేపీ పొత్తుపై కామెంట్లు... ఇలా ఆ మధ్య వరుస వార్తలతో టీడీపీ ఎంపీ కేశినేని నాని వార్తల్లో నిలిచిన విషయం ఎరుకే. అయితే తన వల్ల పార్టీకి ఎలాంటి చెడు జరగలేదని పైగా చాలా మంచే జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాని.
తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. ఒక ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడని... దాని గురించి తాను అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. యాక్సిడెండ్ కు గురైన బస్సు తప్పడు బస్సు అని నాకు తెలుసు. అందుకే బ్రేక్ ఇన్స్ పెక్టర్ ఇచ్చే ఒక కాపీని ఇవ్వాలని తాను అడిగాను. కానీ, సరైన స్పందన లేకుండా పోయిందన్నాడు. నిజానికి ఆ బస్సు ఆరంజ్ ట్రావెల్స్ కు చెందింది, దాని అధినేత సునీల్ రెడ్డి కడప నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి, ఆ తర్వాత నిజామాబాద్ కు వలస వెళ్లాడని చెబుతుంటారని నాని తెలిపాడు.
అంతేకాదు ఈసారి నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తాడని కూడా కొందరు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్నప్పుడు కవిత మనిషినని చెప్పుకుంటారని, ఏపీకి వచ్చినప్పుడు ఆరెస్సెస్ మనిషినని చెప్పుకుంటారని ఆరోపించారు. రెండు మూడేళ్ల నుంచే అతను ట్రావెల్స్ వ్యాపారంలో కనపడుతున్నాడని... ఈ మధ్య కాలంలోనే 180 బస్సులకు పెంచాడని... ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్లే అని చెప్పాడు. క్రైం చేయడం అతనికి బాగా తెలుసని... పన్నులు కట్టకుండా బస్సులు తిప్పుతున్నారని ఆరోపణలు గుప్పించాడు. తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోనన్న నాని, నియోజకవర్గం కోసం చాలా కష్టపడి పని చేస్తున్నానని... సుమారు రూ. 4 వేల కోట్ల పనులు విజయవాడకు మంజూరయ్యాయని తెలిపాడు.
చంద్రబాబు చెబితేనే...
తనని టీడీపీలోకి తీసుకొచ్చిందే చంద్రబాబు అన్న విషయం గుర్తు చేసుకున్న ఆయన చివరి వరకు టీడీపీతోనే ఉంటానని చెప్పాడు. పార్టీలోకి రాకముందు మూడు నెలల పాటు తాను ప్రజారాజ్యంలో ఉన్నానని తెలిపాడు. వ్యక్తిగతంగా చిరంజీవి చాలా మంచి వ్యక్తి అన్న నాని, పార్టీని మాత్రం సమర్థవంతంగా నడిపించలేకపోయారన్నాడు. పీఆర్పీని వీడిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనకు అనిపించలేదని, కానీ, చంద్రబాబు బలవంతం మేరకే మళ్లీ తాను రావాల్సి వచ్చిందని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని... 'నువ్వొద్దురా పో' అంటే, వెళ్లిపోయి కార్గో వ్యాపారం చూసుకుంటానని స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more