జగన్ వార్నింగ్.. రోజా మనస్థాపం... టీడీపీ లేదా జనసేన లోకి జంప్.. ఇలా గత నాలుగైదు రోజుల నుంచి ప్రముఖ పత్రికల్లో, సైట్లలో వార్తలు ఊదరగొడుతున్నాయి. దీంతో ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగింది. అసలు తాను పార్టీ మారుతున్నానా? అంటూ మీడియానే రివర్స్ లో ప్రశ్నించింది ఆమె.
పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నట్లు వచ్చిన వార్తలపై శనివారం ప్రెస్ మీట్ లో రోజా మండిపడింది. జనసేనే కాదు, తాను టీడీపీలోకి కూడా వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆమె చెబుతోంది. కులం పేరుతో తనను ఓడించేందుకు యత్నించిన చంద్రబాబు ఎక్కడా? పార్టీలోకి రాగానే ఎమ్మెల్యేను చేసిన జగన్ ఎక్కడ? ఇద్దరికీ పోలిక అంటూ విరుచుకుపడింది. పనికిమాలిన టీడీపీ, తలాతోకలేని జనసేనలోకి వెళ్లే అవసరం తనకేం లేదని చెబుతోంది.
తనకు తల్లిదండ్రులు లేరని, జగన్ తనను సోదరిలా భావిస్తారని, తానిప్పుడు ఆయన రక్షణలోనే ఉన్నానని, జగన్కి తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. అసలు పార్టీలో ఆయన పన్నెత్తి మాట ఎవరినీ అనరని కూడా అంటోంది. తన నుంచి నిర్ధారణ లేకుండా పార్టీ మారుతున్నాననే కొందరు తప్పుడు కథనాలు రాశారు. వాళ్లకు అసలు విలువలు ఉన్నాయా? అంటూ మండిపడింది. అనుకూల పత్రికలతోనే టీడీపీ అలాంటి కథనాలు రాయించుకుంటుందని ఆరోపణలు గుప్పించింది.
ఇక కేబినెట్ లో తాగుబోతులందరూ కూర్చుని కొత్త మద్యం పాలసీని తెచ్చారని, సారా చంద్రబాబు ప్రభుత్వం(నారా బదులు సారా అని చమత్కరించింది) రాష్ట్రంలో తాగుడును మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రజలకి అన్యాయం చేస్తే తమ పార్టీ ఊరుకోదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై
ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more