రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనాను రక్షించేందుకు ఎన్డీఆరఎఫ్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోబో టెక్నాలజీ (రోజోటిక్ హ్యాండ్)తో పాపను బోరుబావి నుంచి క్షేమంగా బయటకు తీయాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోరుబావి నుంచి మోటార్ వచ్చిందే తప్ప పాప రాలేదు. దీంతో చిన్నారి మీనా క్షేమంగా బయటకు రావాలని కాంక్షిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు అగ్నిమాపక, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ యంత్రాంగం సహకారంతో బోరులో ఉన్న మోటారును జాగ్రత్తగా తీయడం ద్వారా పాపను బయటకు లాగవచ్చని భావించి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇది కాస్త రిస్క్ అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో పాపను అలా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ అధికారుల ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా మీనా మరో రెండు అడుగుల కిందకు జారిపోయింది. ఈ విషయం తెలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే కిందకు జారిన తరువాత పాప అరుపులు ఏమీ వినిపించడం లేదని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయంగా జేసీబీతో సమాంతరంగా గొయ్యి తవ్వుతున్న రెవెన్యూ అధికారులు ఇప్పటికే 30 అడుగులు భూమిని తొవ్వారు. రాతి భూమి కావడంతో రాయి ఫలకలు అడ్డువస్తున్న కారణంగా పని ఆలస్యమవుతోంది.
సహాయ చర్యలకు అడ్డుగా నిలిచిన వరుణుడు
అయితే మరో మూడు నాలుగు గంటల్లో మిగిలిన 10 అడుగుల భూమిని కూడా తొవ్వేసి.. పాపను రక్షిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా, పాపను సురక్షితంగా బయటకు తీసుకోచ్చేందుకు ప్రకృతి కూడా సహకరించని పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి. అయినా అధికారులు సహాయక చర్యలను నిలపకుండా కొనసాగిస్తున్నారు. దీంతో అంతా పాప క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
అంతకుముందు బోరుబావిలో పడిన మీనా ప్రాణాలతో ఉందని ఎన్డీఆర్ఎఫ్ నిపుణుడు తెలిపారు. గత రాత్రి నుంచి పాపను బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఒక మనిషిని తల్లికిందులుగా లోపలికి పంపే ఆలోచన కూడా చేశామని, ఆయితే బోరు బావి లోపలికి వెళ్లే కొద్దీ భూమి కుంగిపోకుండా వేసిన రక్షణ పైపు అంతమైపోయిందని, దీంతో భూమిలోపలి రంధ్రం నేరుగా లేదని, మధ్యలో మట్టివంటివి పడ్డాయని ఆయన చెప్పారు. ఆక్సిజన్ అందుతుండడంతో పాప ప్రాణాలతోనే ఉందని ఆయన చెప్పారు కాగా, గ్రామ పెద్దలు, చిన్నారి బంధువులు శోకసంధ్రంలో ముగిగిన పాప తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులు రాష్ట్ర ప్రజలకు నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తక్షణం మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. బోరుబావులు తవ్విన తరువాత నీరు పడలేదని, వినియోగించడం లేదని నిరుపయోగంగా వదిలేసిన బోరుబావులను తక్షణం పూడ్చివేయాలని ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమైన తరువాత మేల్కొనే కంటే ముందుగానే చర్యలు చేపట్టడం శ్రేయస్కరం అని వారు చెప్పారు. ఇలా బోరుబావులు పూడ్చేందుకు ఎవరైనా నిరాకరించినా, నిర్లక్ష్యం చేసినా తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ పోలీసులు ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుసని వారు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more