అధికారుల నిర్లక్యం మరో పసి ప్రాణాలను ఊగిసలాటలో పడేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో చిన్నారి మీనా నిన్న సాయంత్రం(గురువారం) పడిపోగా, రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి మహేందర్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవటంతో రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంఘటనా స్థలంలో రాత్రి నుంచి అధికారులతో మంత్రి సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నాడు.
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం గోరేపల్లికి చెందిన కొటం యాదయ్య, రేణుక దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. వీరు బతుకు దెరువుకోసం చేవెళ్ల మండలం చన్వెల్లి వచ్చి తిరుమలి రాంరెడ్డి వద్ద పాలిహౌజ్లో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే పొలం పనులలో నిమగ్నమయ్యారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద పెద్దపాప అక్షిత(2), మరోపాప (18 నెలలు) ఆడుకుంటున్నారు. సాయంత్రం 6.20 ప్రాంతంలో ప్రమాదవశాత్తు అక్కడి బోరుబావిలో చిన్నారి పడిపోయింది. అక్షిత ఏడుస్తూ తండ్రి వద్దకు పరుగెత్తుకెళ్లి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు బోరువైపు పరుగులు తీశారు. లోపల చిన్నారి పడి ఉండటాన్ని గమనించి, చుట్టు పక్కల పొలాల వద్ద ఉన్న రైతులకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించగా, ఆపై సీఐ, మంత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ముందుగా పాపకు ఆక్షిజన్ అందించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. అలాగే సమాంతరంగా గోతిని తవ్వే ప్రయత్నం ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ లోపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి లోపలికి కెమెరాను పంపి, పాప ఎంతలోతులో ఉందో నిర్ధారించారని అన్నారు. ఆ తరువాత పాపను తీసేందుకు ప్రత్యేక పరికరాలతో ప్రయత్నాలు ప్రారంభించారని ఆయన చెప్పాడు. నీళ్లు పడని బావులను వెంటనే పూడ్చేలా చూసుకోవాలని గతంలో గ్రామాధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవటం, యజమాని రాంరెడ్డి కూడా దానిపై ఓ గోనె సంచిని కప్పి ఉంచటం, ఇటీవల వర్షాలకు నీళ్లు పడ్డాయేమోనని తెరిచిపెట్టడంతో ఇంతటి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతూనే... కొచ్చి నుంచి ప్రత్యేక టీం రంగంలోకి దిగగా, రోబోటిక్ చేతితో పాపను బయటికి తీసే యత్నం చేస్తున్నారు. నుంచి పాప క్షేమంగా రావాలని ఉత్కంఠగా అంతా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more