బ్రహ్మపుత్ర నది మెడలో మణిహారం పడింది. నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా దేశంలోనే అతిపొడవైన బ్రిడ్జిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చాడు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి అస్సోం సీఎం సోనోవాల్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హాజరయ్యారు. స్వయంగా మోదీ కారులో బ్రిడ్జి మీద కలియతిరగటం విశేషం. ఆపై కారు దిగి ఒంటరిగా బ్రిడ్జిని పరిశీలించాడు. అస్సాంలోని సాదియా, అరుణాచల్ప్రదేశ్లోని ధోలాలను ఈ సేతువు కలుపుతుంది. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను బ్రహ్మపుత్రకు ఉపనది అయిన లొహిత్ పై నిర్మించారు.
అసోం రాజధాని దీస్ పూర్కు 540 కిలోమీటర్లు, అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపే ఉంది. వంతెన నిర్మాణం 2011లో ప్రారంభమైంది. తెలుగు కంపెనీ అయిన నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ మొత్తం రూ.2, 056 కోట్ల ఖర్చుతో ఆరేళ్లలో దీనిని నిర్మించటం విశేషం. సాదియా-ధోలా బ్రిడ్జి ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 6 గంటల ప్రయాణ దూరాన్ని కేవలం గంటకు తగ్గించనుంది. ముఖ్యంగా అరుణాచల్ప్రదేశ్, అసోం ప్రజలు ఎయిర్పోర్టు, రైలు మార్గాలను వేగంగా చేరుకునే వెసులుబాటును ఈ బ్రిడ్జి కల్పిస్తోంది. ఇంతకు ముందు పెద్దదైన ముంబైలోని బాంద్రా-వోర్లి సీ లింక్ బ్రిడ్జి కంటే ఇది 3.55 కిలోమీటర్ల పొడవైనది.
చైనో-ఇండియా సరిహద్దుకు సమీపంలో ఉండడంతో యుద్ధ సమయంలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సైన్యానికి వేగంగా చేరవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే 60 టన్నుల యుద్ధ ట్యాంకును కూడా దీనిపై నుంచి తరలించేంత దృఢంగా దీనిని నిర్మించారు. దీంతో డ్రాగన్ కంటీ ఇటువైపు ఓ కన్నేసి ఉంచింది. ఇక ఆవిష్కరణ తర్వాత గౌహతి సభలో మోదీ ప్రసంగించాడు.
పేలుడుతో హై సెక్యూరిటీ...
ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే గురువారం బాంబు పేలుడుతో అసోం దద్దరిల్లింది. దిబ్రూగఢ్ జిల్లాలోని దికోమ్ చరియాలోని ఓ ఆయిల్ పైప్లైన్లో ఈ బాంబు పేలుడు సంభవించింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) ఈ బాంబును పేల్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ తామే ఈ పనిచేసినట్టు ఉల్ఫా (ఐ) సంస్థ ప్రకటించింది. బాంబు పేలుడు జరిగిన ప్రదేశం నుంచి అనుమానిత ఉల్ఫా (ఐ) తీవ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more