బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో రోజువారి విచారణ జరిపి రెండేళ్లలో విచారణను ముదించి తుది తీర్పును వెలువరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబిఐని అదేశించిన నేపథ్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో ఈ కేసులో నిందితులపై అదనపు అభియోగాలను నమోదు చేయనుంది సీబిఐ. ఈ కేసులో ప్రధాన నిందితులుగా వున్న బీజేపి అగ్రనేతలతో పాటు అర్ఎస్ఎస్ నాయకులు మొత్తం 12 మందిపై అదనపు అభఇయోగాలను దాఖలు చేయనుంది. ఈ మేరకు సిబిఐ సుప్రీంకోర్టును గతంలోనే చెప్పింది.
బాబ్రీ మసీదు కూల్చివేతలో కుట్ర కోణం వుందన్న అరోపణలు విచారిస్తున్న సిబిఐ.. ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్ సహా సాధ్వీ రితాంభరి, విష్ణు హరి దాల్మియాలపై అభియోగాలను ఈ నెల 26న ధాఖలు చేయనున్నారు. కాగా, మహంత్ న్రిత్య గోపాల్ దాస్, మహంత్ రామ్ విలాస్ వేదాంతి, బైకుంత్ లాల్ శర్మ అలియస్ ప్రేమ్ జీ, చంపత్ రాయ్ బన్సాల్, ధర్మ దాస్, డాక్టర్ సతీష్ ప్రధాన్ లపై అదనపు అభియోగాలను శుక్రవారం దాఖలు చేయనున్నారు.
అయితే బాబ్రీ కూల్చివేత అంశంలో వీరిపై ఉన్న నేరపూరిత కుట్ర ఆరోపణలను 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేయగా, గత నెలలో సుప్రీంకోర్టు పునరుద్ధరించిన విషయం తెలిసిందే. కాగా, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బి ప్రకారం అద్వానీ తదితరులపై కొత్తగా అభియోగాలు మోపొచ్చని సుప్రీంకోర్టు తెలపడంతో ఈ కేసులో నిందితులపై మరిన్నీ అదనపు అభియోగాలను నమోదు చేసే అవకాశమున్నట్లు సమాచారం. అభియోగాలను నమోదు చేయనున్న క్రమంలో నిందితులందరినీ కోర్టు తమ ఎదుట హాజరుకావాలని అదేశించింది. దీంతో బీజేపి అగ్రనేతలు రేపు సీబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకావాల్సివుంది. అయితే వ్యక్తిగత హజరునుంచి తమకు మినహాయింపు కల్పించాలని ఇప్పటికే బీజేపి నేతలు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more