ధేశంలోని ఏ టీవీ ఛానెల్ అయినా.. లేక ఏ ప్రసారమాధ్యమమైన కొన్ని పరిధులకు లోబడే వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛ పేరుతో దేశ భధ్రతకు ప్రమాదకరమైన అంశాలను తీసుకుని వాటిపై కార్యక్రమాలను ప్రసారం చేయడమన్నది సహించరాని విషయం. మన దేశంలో పత్రికా స్వేచ్ఛపై జర్నలిస్టులు ఇంకా అప్పడప్పుడు గళం వినిపిస్తూనే వుంటారు. దీనికి కారణం రాజకీయ నేతలో, అధికారంలో వున్న ప్రభుత్వాలో ఏ పత్రికనైనా, లేక ప్రింట్ మాద్యామాన్ని టార్గెట్ చేసిన సందర్బాల్లోనే అవి వినబడుతుంటాయి. ఇక అధికార పార్టీలకు సానుకూలంగా, వ్యతిరేకంగా పలు మాద్యమాలు విడిపోయిన నేపథ్యంలో కూడా ఇలాంటి గొంతులు వినిపిస్తుంటాయి.
అయితే ఏకంగా దేశభద్రతకే ప్రమాదకరమైన అంశాలను టార్గెట్ చేసిన వాటిపై అభిప్రాయాలను, ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తే.. దేశప్రజలెవరూ సహించరు. తాజాగా 'టైమ్స్ నౌ' ఛానల్ కు రాజీనామా చేసిన ప్రముఖ జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామి 'రిపబ్లిక్ టీవీ' పేరుతో కొత్త న్యూస్ ఛానల్ ను స్థాపించడంతోనే వివాదాలలో చిక్కకుంటున్నారు. తమ వద్ద పనిచేసినప్పుడు తమ ఛానెల్ లో ప్రసారం చేసిన కొన్ని వీడియో, అడియో క్లిప్ లను అర్నబ్ దొంగలించారని టైమ్స్ నౌ యాజమాన్యం కేసు పెట్టిన రెండు రోజుల వ్యవధిలోనే.. తాజాగా అతని ఛానెల్ కు హైదరాబాద్ పోలీసులు మరో కేసుకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు.
అర్నబ్ గోస్వామి ఎడిటర్-ఇన్-చీఫ్ గా వ్యవహరిస్తున్న కొత్త న్యూస్ ఛానల్ 'రిపబ్లిక్ టీవీ' ఏకంగా ఐసిస్ సానుభూతిపరుల ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు రిపబ్లిక్ టీవీకి నోటీసులు ఇచ్చారు. ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఐసిస్ సానుభూతిపరులైన సల్మాన్ మొహినుద్దీన్, ఖురేషి, అబ్దుల్లా బాసిత్ లను రిపబ్లిక్ టీవీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ఐసిస్ తో సంబంధాలకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేసినందుకు నోటీసులు జారీ చేశారు. ఇక రిపబ్లిక్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన ముగ్గురు ఐసిస్ సానుభూతిపనులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more