20 Naxals killed in Bijapur encounter బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 20 మంది నక్సల్స్ హతం

Crpf neutralises 20 naxals in major encounter operation in bijapur

CRPF neutralises 20 Naxals, Bijapur major encounter, 20 Naxals killed in encounter, Chattisgarh, CRPF, Naxals, 20 naxals killed, Bijapur encounter, security agencies

In major operations against Maoists, 20 Naxalites were killed by s

ప్రతీకారం తీర్చుకున్న పోలీసులు.. బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 20 మంది నక్సల్స్ హతం

Posted: 05/16/2017 08:25 PM IST
Crpf neutralises 20 naxals in major encounter operation in bijapur

ఛ‌త్తీస్ గ‌ఢ్‌లోని బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇటీవల మావోయిస్టులు 25 మంది పోలీసులను హతమార్చిన నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో 350 మంది పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అడవుల్లో కూంబింగ్‌ చేపట్టిన పోలీసులకు మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 15 నుంచి 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రోవైపు సుక్మా జిల్లాల్లోని తాల్చేరు ప్రాజెక్టు ప్రాంతంలోని చింతల్నార్‌, చింత‌గుఫా ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మంది మావోయిస్టుల‌ను సీఆర్పీఎఫ్ జ‌వాన్లు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని మావోయిస్టులకు వినియోగించుకునే కోరియర్లుగా (సాయం చేసేవారిగా) అనుమానిస్తున్నారు. అయితే, ఎన్‌కౌంటర్‌ కచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నట్లు తెలిసింది. కాగా, ఎదురు కాల్పుల ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chattisgarh  CRPF  Naxals  20 naxals killed  Bijapur encounter  

Other Articles