దేశంలోని అవినీతి, నల్లధనాన్ని అణచివేతకు, ఉగ్రవాద కార్యకలాపాలకు, అంతర్గత తీవ్రవాద పీచమణిచేందుకు నోట్ల రద్దును చేపడుతున్నామని నవంబర్ 8న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం.. ఆ తదుపరి చర్యలు ఏ మేరకు ప్రతిఫలాలను అందించాయంటే.. పేదలను, మధ్యతరగతివారిని ఇబ్బందులను తెచ్చిపెట్టడం మినహా ఏ మాత్రం ప్రయోజనాలను ఇవ్వలేదని అన్ని విఫక్షాలు ఏకతాటిపైకి రాకుండానే ఐక్యంగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి. పాత పెద్ద నోట్లు.. రూ. ఐదు వందలు, వెయి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ ఎనమిదిన తీసుకున్న నిర్ణయం.., ఆరు మాసాల తరువాత కూడా ప్రజలకు ఎలాంటి ప్రతిఫలాలను ఇవ్వలేకపోయిందని, ఏకంగా ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది.
భారత ప్రధాని మోడీ సహా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ, భారతీయ రిజర్వు బ్యాంకులన్నీ ఎంతగా ప్రచారం చేసినా.. అవన్నీ ఒట్టి మాటలనే స్పష్టమైంది. చేసిన కష్టానికి డబ్బులు రావడం లేదని అంగలార్చిన ప్రజలకు నోట్ల కష్టాలంటే ఏమిటో..? అవి ఎంతలా బాధపెడతాయో అర్థమయ్యేలా మాత్రం చేసింది. ప్రధాని సహా కేంద్రమంత్రులు, అర్థిక వ్యవహరాల శాఖ అధికారులు చెప్పినవన్నీ అమలుకు మాత్రం నోచుకోలేదని తేలిపోయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గత అరు నెలలుగా భారత్ లో నల్లధనానికి అడ్డుకట్ట పడలేదని స్పష్టం చేసిన ఐక్యరాజ్య సమితి ఇక భవిష్యత్తులో కూడా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని భావించలేమని అభిప్రాయపడింది.
నోట్ల రద్దు జరిగి సరిగ్గా ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఓ నివేదికను విడుదల చేస్తూ, చలామణిలో ఉన్న 87 శాతం కరెన్సీని రద్దు చేయడం మంచి విషయమే అయినా, దీనివల్ల నల్లధనం ఆగుతుందని భావించలేమని, ఇదే సమయంలో అన్ని రకాలుగా వెల్లడించని ఆస్తులను బయట పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని 'ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ ది పసిఫిక్ 2017' పేరిట విడుదల చేసిన రిపోర్టులో యూఎన్ పేర్కొంది. ఇండియా జీడీపీలో 20 నుంచి 25 శాతం విలువైన నల్లధనం ఉండి వుండవచ్చని, ఇందులో 10 శాతం నగదు రూపంలోనే ఉందని భావిస్తున్నామని తెలిపింది. మరిన్ని డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలతో చలామణిలో పారదర్శకత పెరుగుతుందని అంచనా వేసింది. ఇండియాలో మొత్తం లావాదేవీల్లో 20 శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని, వ్యక్తిగత ఖర్చులో 5 శాతమే నగదు రహితమని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more