అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నప్పటి నుంచి ఆ దేశంలోకి వలసలు నిలపివేస్తూ.. పలు అంక్షలు విధించారు. ఇదే క్రమంలో యుఎస్ కు వచ్చే వలసదారులపై కూడా అనేక అంక్షలు విధించారు. ఈ అంక్షల ప్రభావంతో భారతీయ యువకుల అనేకమంది ఉఫాధి, ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోయారు. అమెరీకన్ ఇమ్మిగ్రేషన్ విధానంపై భారత ప్రభుత్వం స్పందించడం లేదేమని దేశీయ యువతతో పాటు అగ్రరాజ్యంలోని ప్రవాస భారతీయులు కూడా వేచిచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు కేంద్ర ఐటీ శాఖ స్పందించింది.
ఈ విషయమై కేంద్ర ఐటీ శాఖామంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్రంప్ విధానాలపై ఎక్కుపెట్టి ఘాటుగా స్పందించారు. విదేశీయులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయ ఐటి కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి తప్ప దొంగిలించవని రవిశంకర్ ప్రసాద్ తేల్చిచెప్పారు. దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ హెచ్ 1బీ వీసాలపై విధించిన కొత్త ఆదేశాలపై స్పందించారు. అంతేకాదు వరుస ట్వీట్లలో ఐటీ కంపెనీల సామర్థ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఐటీ కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిగ్ డేటా తదితర అంశాల్లో భారీ అవకాశాలున్నాయని ట్వీట్ చేశారు.
భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో లేదా ఏ ఇతర దేశంలో గాని ఉద్యోగాలను దొంగిలించవని స్పష్టం చేశారు. బహుళ జాతి సంస్థల పెద్ద వ్యాపారంలో మన దేశ ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఐటీ సంస్థలు కూడా ఇప్పుడు భారత్ వైపు తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ‘డిజిటల్ ఇండియా’తో విస్తృత మార్కెట్ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్లో సేవల వైపు చూడాల్సిన సమయం వచ్చిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more