ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి మరో దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26, 27న గుంటూరులో దానిని చేయబోతున్నాడు. అయితే ఇది వరకు చేసిన దీక్షల ఫలితం ఎలాగుందో తెలిసికూడా జగన్ మళ్లీ ఇలా చేయటం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. అయినా జనాల్లోకి బలంగా దూసుకెళ్లాలన్న, ప్రజా నేతగా ముద్ర వేసుకోవాలన్న ఇంతకు మించి మరో దారి లేదనే భావనలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. తెలుగుదేశం ప్రభుత్వంకు వ్యతిరేకంగా జగన్ చేయబోతున్న దీక్షపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించాడు.
దీక్షల పేరుతో జగన్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని. కేవలం ఉనికిని చాటుకోవడానికే తప్ప అవి ఎందుకు పనికిరావని సోమిరెడ్డి తేల్చేశాడు. తమ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ జగన్ ఇలా దీక్షల పేరిట హడావుడి చేయటం సరికాదని చెబుతున్నాడు. ‘‘అప్పుడప్పుడు జగన్ ఇలా దీక్షలు చేయడానికి వెనకాల ఓ సీక్రెట్ రీజన్ ఉంది. నాలుగైదు నెలలకొకసారి రెండురోజుల పాటు ఇలా ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని జగన్కి వైద్యులు సూచించారు. అందుకే అడపా దడపా ఇలా దీక్షలంటూ.. సోమిరెడ్డి ఎద్దేవా చేశాడు.
ఇక రాష్ట్రంలోని రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్న మంత్రి అవసరమైన సూచనలు ఇవ్వకుండా ఇలా ఆందోళనలు చేపట్టడం సరికాదని జగన్ కు సూచించాడు. రాయలసీమ అభివృద్ధి సమయంలో జగన్ ఇలాగే దీక్షకు దిగుతున్నాడా? అంటూ సోమిరెడ్డి చురకలంటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more