హైదరాబాద్ హోటళ్లు అనారోగ్యానికి నిలయాలుగా మారుతున్నాయి. ప్రజలకు మంచి అహరాన్ని వడ్డించాల్సిన హోటళ్లు, ఓ వైపు డబ్బులను లాగుతూనే.. వారికి అనారోగ్యకమైన అహారాన్ని అందిస్తున్నాయి. చిన్న స్థాయి హోటళ్ల నుంచి పేరొందిన పెద్ద చైన్ హోటళ్ల వరకు అన్ని కూడా అనారోగ్యాన్ని వ్యాప్తి చేసే కేంద్రాలుగానే మారుతున్నాయి. ఏ ఒక్క హోటళ్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. సరికదా.. క్వాలిటీలో తామే బెస్టు అంటూ కస్టమర్ల వద్ద నుంచి మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ధమ్ బిర్యాని, చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ఇలా పేర్లు ఏవైనా వాటిని చూసి లోట్టలేస్తూ అక్కడే తిన్నా లేక వాటిని పార్శిల్ తీసుకుని మీ ఇంట్లో తిన్నా అనార్యోగం గ్యారంటీ. హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే ధమ్ బిర్యానీలో హోటళ్లు వినియోగించే మాంసం తినడానికి పనికిరానిదని.. పైపెచ్చు వీటిని సేవించడం వల్ల అనారోగ్యం బారిన పడటం తప్పదని తాజాగా పలు హోటళ్లపై దాడులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు తేల్చిచెబుతున్నారు.
జంతువుల ఆరోగ్యస్థితిని, వయసును పరిశీలించి.. అవి తినడానికి అర్హమైనవిగా గుర్తించి జీహెచ్ఎంసీ స్టాంపు వేసిన వాటినే వధించాలని ఇదివరకే ప్రకటించినా.. ఆ ఆదేశాలను పక్కనబెట్టి అనేక హోటళ్లు గుర్తంపు లేని వధశాలలోనే ముసలి, ముతక, మరీ లేత, అనారోగ్యం బారిన పడిన జంతువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. దీంతో నగరంలోని అనేక హోటళ్లపై దాడులు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని జరిమానాలు విధించాయి.
నాణ్యతా ప్రమానాలు పాటించని హోటళ్లలో అటు బార్ అండ్ రెస్టారెంట్లుతో పాటు ఇటు పేరు మోసిన హోటళ్లు కూడా వున్నాయి. మినర్వా గ్రాండ్, ప్యారడైజ్, అల్ షబా, సోహెల్ హోటల్, డ్రంక్ యార్డ్ శివాని రెస్టారెంట్ అండ్ బార్, అస్టోరియా, అన్ ఓహ్రీన్, సాగర్ రెస్టారెంట్ లు ప్రమాణాలు పాటించని కారణంగా వాటిపై దాడులు నిర్వహించిన అధికారులు పది నుంచి ఇరవై వేల వరకు జరిమానాలు విధించారు. ఈ మేర మొత్తం లక్ష 40 వేల రూపాయల వసూళ్లను రాబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more