న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ, హనీష్ సాయి కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. భర్త నర్రా హనుమంత రావే వాళ్లిద్దరినీ హత్య చేసి కట్టుకథలు అల్లుతున్నాడని, ఇంట్లోకి వచ్చి మరీ చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని శశికళ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తమ అల్లుడికి అమెరికాలో మరో మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందని వారు వాదిస్తున్నారు.
కేరళకు చెందిన ఓ యువతితో హనుమంత రావుకి సంబంధం ఉందని, ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయని వారంటున్నారు. భర్త పెట్టే టార్చర్ గురించి శశికళ ఫోన్ లో సమాచారం ఎప్పటికప్పుడు అందించేందని కూడా వారు వివరించారు. అప్పుడే అప్రమత్తం అయ్యి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని, కుమార్తెను, మనుమ డిని కోల్పోవాల్సి వచ్చేది కాదని విలపిస్తున్నారు.
కాగా, జాతి విద్వేష కోణంలోనే ఇది జరిగిందన్న కోణాన్ని కూడా కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు కూడా. ఇక అత్త, మామలు తనపై చేస్తున్న ఆరోపణలపై శశికళ భర్త నర్రా హనుమంతరావు స్పందించారు. శశికళ తల్లిదండ్రులు బాధలోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన భార్య శశికళ కుమారుడు హనీశ్ సాయిని తాను హత్య చేయలేదని నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలుతాయని హనుమంతరావు చెప్పారు.
కాగా ఆయన మరో చిత్రమైన వాదన వినిపించారు. భార్య-కుమారుడి మృతదేహాలు స్వగ్రామానికి వస్తాయని చెప్పిన నర్రా హనుమంత రావు తాను వచ్చేది లేనిది ఇంకా నిర్ణయిం తీసుకోలేదని చెప్పడం గమనార్హం. కాగా 2004 డిసెంబరు 30న నర్రా హనుమంతరావుకు శశికళకు వివాహం జరిగింది. 2006లో నర్రా హనుమంతరావు న్యూజెర్సీ వెళ్ళాడు. సీటీఎస్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్నశశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. శశికళ బుధవారం సాయంత్రం బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more