కేవలం ట్వీట్లతోనే ఆపదలో ఉన్న వారిని తక్షణం ఆదుకునే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్మరాజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. సెర్బియాలో ఆపదలో ఉన్న ఓ ఇండియన్ కు సాయం చేసి ఇండియాకు రప్పించే యత్నం చేస్తోంది. అయితే ఈసారి ఓ వ్యక్తి డ్రామా చేసినా కూడా పెద్ద మనసుతో స్పందించి అతనికి సాయం చేసేందుకు ముందుకు రావటం విశేషం.
రాజీవ్ శర్మ అనే వ్యక్తి సెర్బియా లో ఉన్న తన సోదరుడు వినయ్ మహజన్ ఆపదలో ఉన్నట్లు సుష్మాకు ఓ ట్వీట్ వేశాడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతూ అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్టు చేశాడు. చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తిని కట్టేసి కొడుతున్నట్లుగా ఉంది. ఆ ట్వీట్ కు ఫాస్ట్ గా రియాక్ట్ అయిన చిన్నమ్మ సెర్బియాలోని ఇండియన్ ఎంబసీకి పంపించి ఆదుకోవాలని కోరింది.
రంగంలోకి దిగిన అధికారులు అతన్ని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే అదంతా ఫేక్ డ్రామా అని ఆపై అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఏజెంట్ మోసం చేయటం, పైగా డబ్బు లేకపోవటంతో ఇండియాకు రావటానికి ఇలా డ్రామా ఆడాడన్న మాట. దీంతో అసలు విషయం అర్థమైన సుష్మా మరో ట్వీట్ వేసింది. ‘రాజీవ్! నీ సోదరుడు అధికారుల సమక్షంలో క్షేమంగానే ఉన్నాడు. మరో విషయమేంటంటే, అతన్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నువ్వు పంపిన వీడియో నకిలీది. మీ తమ్ముడే కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా సెర్బియాలో ఉన్న భారత దౌత్యాధికారులతో మాట్లాడాను. మీ తమ్ముడిని మార్చి 25న భారత్కు పంపిస్తామని చెప్పారు’ అని ట్వీట్ చేసింది.
అంతేకాదు అక్కడ ఇబ్బందులు పడుతున్న మరో 500 మంది భారతీయుల విషయంపై కూడా తాను ఎంబసీ తో మాట్లాడినట్లు తెలిపింది. అయితే సుష్మా మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఇలాంటి ఫేక్ వ్యవహారాలతో విసిగించొద్దంటూ పలువురు కామెంట్లు పెడితే, ఆపదలో ఉన్నవారిని కాపాడటం మంత్రిగా తన బాధ్యత అంటూ మరో సమాధానం ఇచ్చింది సుష్మా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more