తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్థుల కేసులో అమె నిచ్చెలి చిన్నమ్మ శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తూ ఏం చదవుతున్నారో తెలుసా.? అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైన శశికళ తనకు వచ్చిన మెయిళ్లతో పాటు ఉత్తరాలు చదువుతున్నారట. అయితే శశికళ పేరున వచ్చిన లేఖలు అమెను ఓదార్చడానికో లేక ధైర్యం చెప్పడానికో అభిమానుల నుంచి వెల్లువెత్తనవి కాదట. మరెవరు రాసారు..? అయితే వాటిని శశికళ ఎందుకు చదువుతున్నారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కదూ.
అయితే లేఖలన్నీ తన పేరునే రావడంతో అమెకు తప్పలేదు. ఇంతకీ ఆ మెయిళ్లలో ఏముంది..? అంటే.. ఆమెకు ఫుల్ గా శాపనార్థలు పెడుతూ జయలలిత అభిమానులు ఈ ఉత్తరాలను రాస్తున్నారట. అమ్మ మరణానికి కారణమైన శశికళ నాశనం కావాలి అంటూ అమెకే ఈ ఉత్తరాలను పంపుతున్నారంటే ఇది నిజంగా విచిత్రమే. అయితే ఇలాంటి ఉత్తరాలు, మెయిళ్లు ఇప్పటి వరకు వందకు పైగా వచ్చాయని, ఇక మరికొన్ని ఉత్తరాలలో అమ్మ అభిమానులు చిన్నమ్మను అమ్మను హత్య చేసిన హంతకురాలి, అసభ్యపదజాలాన్ని కూడా వాడారని జైలు వర్గాలు సమాచారం.
అమ్మ అకస్మిక మరణానాకి శశికళే కారణమని, అమె నయవంచకురాలని, అమ్మకు అస్పత్రి పాలు కావడం ఇక బయట ప్రపంచాన్ని చూడకుండానే అమె చనిపోవడం అంతాకూడా శశికల కుట్రలో భాగమేనని అభిమానులు తిట్లదండకాన్ని మెయిళ్లలో రాశారట. ఈ లేఖలన్నింటిని ముందుగా ఇలవరసి చదివి వాటిలో మరీ అభ్యంతరకరమైనవి, అసభ్య పదజాలమున్న వాటిని శశికళకు ఇవ్వకుండా మిగతా వాటిని మాత్రమే ఇచ్చేదని జైలు అధికారులు తెలిపారు. శశికళ, సెంట్రల్ జైల్, పరప్పణ అగ్రహార, బెంగళూరు - 560100 అడ్రస్ కు ఈ లేఖలు వచ్చాయని చెప్పారు.
కాగా ఈ లేఖలు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా దిండిగల్, కరూర్, తిరుచిరాపల్లి, మధురై, ధర్మపురి, సేలం, చెన్నైల నుంచి వచ్చినట్లు పేర్కోన్నారు. మొదట్లో అన్ని ఉత్తరాలను శశికళే చదివేవారని. కాగా అ తరువాత ఇళవరసి ముందుగా చదివి ఆ తరువాత శశికళకు వాటిని ఇస్తున్నారని తెలిపారు. అయితే వందకు పైగా ఉత్తరాలు వచ్చినా.. వాటిలో శశికళను ఓదార్చుతున్న లేఖలు, అమెకు ధైర్యం చెబుతున్న మెయిళ్లు మాత్రం లేకపోవడంతో ఇక అమె గతకొద్ది రోజులుగా వాటిని చదవడం మానేశారట. నిజం చెబితే ఎవరైనా నిష్టూరం కావాల్సిందేగా మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more