రెండేళ్ల క్రితం ఏపీ అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఎత్తున్న దూషణల పర్వమే జరిగింది. ఇందులో భాగంగా టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు వైసీపీ సభ్యులను ఉద్దేశించి కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. ప్రతిపక్ష నేత జగన్ 420 అని, కొడాలి నాని మరియు ఫైర్ బ్రాండ్ రోజాను ఐరెన్ లెగ్ లుగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా రోజా ఆంటీ సభలో తీవ్ర గందరగోళం రేపుతుందంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై రోజా బొండా ఏమైనా కుర్రాడు అనుకుంటున్నాడా? అంటూ అదే స్థాయిలో కౌంటర్ వేసిందనుకోండి.
అయితే తాను గతంలో రోజాపై చేసిన వ్యాఖ్యలపై ఉమ ఇప్పుడు వివరణ ఇచ్చుకున్నాడు. గురువారం ఉదయం అసెంబ్లీకి వెళుతున్న సమయంలో బొండాను ఈ విషయంపై మీడియా ప్రతినిధులు క్లారిటీ అడిగారు. "మేమేం బూతులు మాట్లాడలేదు. ఆంటీ అనే పదం చాలా గౌరవప్రదమైందని, ఆ అనే పదం రోజాకు పూర్తిగా సరిపోతుందని తెలిపాడు. అయినా నేను ఆంటీ అంటే... నన్ను తిరిగి ఏమైనా అనమనండి, కానీ, మధ్యలో తమ సహచరురాలు అనితను దూషించడం ఏమిటి? ఓ దళిత ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు రోజా దూషించడం సరికాదు" అని ఉమా వివరణ ఇచ్చాడు.
ఇక రోజా సస్పెన్షన్ ప్రస్తావిస్తూ శాసనసభలో రోజాకు ప్రత్యేకమైన చట్టాలు ఏమీ ఉండవని... చట్టం అందరికీ సమానంగానే ఉంటుందని తెలిపాడు. ప్రివిలేజ్ కమిటీ ఎవరి మాటలూ వినదని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గతంలో క్షమాపణలు చెబుతానన్న రోజా ఆ పని చేయలేదని, అందుకే ప్రివిలేజ్ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని తెలిపాడు.
మరో ఏడాది సస్పెన్షన్...
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల సంఘం నివేదికను ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 62 పేజీలతో కూడిన నివేదికను ప్రివిలేజ్ కమిటీ సభకు సమర్పించింది. విచారణకు సంబంధించిన అన్ని విషయాలను ఈ నివేదికలో కమిటీ పొందుపరిచింది. రోజాపై ఇప్పటికే ఉన్న సస్పెన్షన్ ను మరో ఏడాది పాటు పొడిగించాలంటూ కమిటీ సిఫార్సు చేసింది. బేషరతుగా క్షమాపణ చెబుతానన్న రోజా... క్షమాపణ చెప్పలేదని నివేదికలో కమిటీ తెలిపింది. విచారణ సందర్భంగా వివిధ సందర్భల్లో భిన్నమైన వాదనలను రోజా వినిపించారని చెప్పింది. అయితే, రోజా సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సభకే వదిలేసింది కమిటీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more