ఎవరికైనా సమస్యలు ఉత్పన్నమయితే వారికి చటుక్కున గుర్తుకువచ్చేది కంటికి కనిపించని దేవుడే. కొబ్బరికాయలు కొట్టేసి, నైవేద్యాలు పెట్టేసి దేవుడా ఈ సమస్యను నుంచి మమల్ని గట్టెక్కించు అంటూ కోరుకుంటారు. అయితే ఇక్కడ మనం మనుషులు వారి మనన్తత్వాలు అనే అంశంపై కాకుండా దేవుడి గురించి కూడా ఓ సారి అలోచిద్దామా..? దేవుడికే సమస్యలు ఉత్పన్నమయితే ఏం చేస్తారు..? దానిని ఎవరికి నివేదిస్తారు.. ఎలా పరిష్కరిస్తారు అన్న అలోచన ఎప్పుడైనా కలిగిందా..?
పురాణా కథల్లో దేవుళ్లుకు కష్టాలు వస్తే తీర్చిన ఆ మహావిష్ణువు అవతారంలోని వున్న కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడికే కష్టం వచ్చింది. అదేంటి ఆ దేవదేవుడిని నమ్ముకునే కోట్లాది మంది భక్తులు కలియుగ వైకుంఠానికి వెళ్తుంటారు. అలాంటి అయనకే కష్టం వచ్చిందా..? అంటే అవుననే అనాలి. అది కూడా మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకువచ్చిన ఇబ్బందే. అలోచనలో పడ్డారా..? అదేంటి నారయణుడికి నరుడి కష్టాలను సృష్టించడమా..? అంటూ విస్తుపోకండి.. ఇది ముమ్మాటికీ నిజం.
కుబేరుడి బాకీ తీర్చుకునేందుక వడ్డీకాసుల వాడికి భక్తులు నిలువుదోపిడీలతో ముడుపులు చెల్లిస్తుంటారు. అయితే ఇలా చెల్లించిన వాటిలో చాలావరకు పాత నోట్లు భారీ మొత్తంలో హుండీల్లో సమర్పించారు కొందరు భక్తులు. ప్రభుత్వం విధించిన డిసెంబర్ 30 డెడ్లైన్ తర్వాత ఈ రెండు నెలల్లో శ్రీవారికి రూ.4 కోట్ల విలువైన పాత 500, వెయ్యి నోట్లు రావడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డెడ్లైన్ తర్వాత పాత నోట్లు పది కంటే ఎక్కువ ఉండకూడదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ పాత నోట్లను ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. ఈ నోట్లను ఏం చేయాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి లేఖ రాశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. కేంద్ర ప్రభుత్వం స్పందన కోసం ఎదురుచూస్తున్నారు టీటీడీ అధికారులు.
డిసెంబర్ 30 డెడ్లైన్ తర్వాత దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు కొత్త నోట్లతోపాటు పాత నోట్లను కూడా హుండీల్లో వేస్తున్నారు. ఇలా రూ.4 కోట్లకుపైగా పాత నోట్లు వచ్చినట్లు వెల్లడించారు టీటీడీ ఈవో సాంబశివరావు. ఇలా ఎప్పటి నుంచో జమైన పాత నోట్లు కూడా ఇప్పుడు హుండీల్లో చేరిపోయాయి. డిసెంబర్ 30 డెడ్లైన్ తర్వాత పది కంటే ఎక్కువ పాతనోట్లు ఉంటే రెట్టింపు జరిమాన విధించాలని నిర్ణయం తీసుకొంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తిరుపతి వేంకన్న దగ్గర ఉన్న నాలుగు కోట్ల రూపాయలకు మోడీ ప్రభుత్వం 8 కోట్లు జరిమాన విధిస్తుందా? లేక దేవుడిపై భక్తితో పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు చెల్లిస్తుందా వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more