నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇవ్వగా దానిని టీజేఏసీ ఉపసంహారించుకుంది. నాగోల్లోని మెట్రో గ్రౌండ్లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు.. ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని అనుమితని ఇవ్వడంతో.. కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీజేఏసీ తమ పిటీషన్ ను ఉపసంహరించుకుంది.
తెలంగాణలో వున్న నిరుద్యోగుల కోసం నిరసన సభ నిర్వహించేదే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియాలని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున సభ నిర్వహించాలనుకుంటే తమకు శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ జేఏసీ తమ పిటిషన్ను వెనక్కి ఉపసంహకరించుకుంది. తాము మాత్రం నాగోల్ మెట్రో గ్రౌండ్లో సభను నిర్వహించబోమని టీ జేఏసీ తేల్చిచెప్పింది. ఈ సభ నిర్వహణ కోసం హైకోర్టులో జరిగిన వాదోపవాదాలను టీజేఏసీ తరుపు న్యాయవాదులు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని అన్నారు.
న్యాయస్థానం, ప్రభుత్వం విధించిన అన్ని షరతులను తాము అంగీకరించామని, జల్లికట్టుతో నిరుద్యోగ నిరసన ర్యాలీని పోల్చారని మొత్తానికి ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండ్ను, హక్కులను తెలంగాణ ప్రభుత్వం అణిచివేసిన పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఫంక్షన్హాలులో సమావేశాలు నిర్వహించుకోండని చెప్తున్నారంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.
యోగ్యంకాని.. సౌకర్యాలు లేని నాగోలు గ్రౌండ్ లో సభ ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించారు జేఏసీ చైర్మన్ కోదండరాం. చివరి నిమిషంలో మార్చుకోవటం సాధ్యం కాదన్నారు. ఎల్బీ స్టేడియం, ఉస్మానియా కాలేజీ, నిజాం గ్రౌండ్ లో అనుమతి ఇవ్వటానికి ఏం అభ్యంతరం అని నిలదీశారు. విద్యార్థుల ర్యాలీలో తీవ్రవాదులు చొరబడే ప్రమాదం ఉందని చెప్పటం చూస్తుంటే.. అణచివేత దోరణి ఏ విధంగా ఉందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుందన్నారు.
సుందరయ్య విజ్ణాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీకి కూడా అనుమతి లేదని చెప్పటాన్ని తప్పుబట్టారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వానికి పెట్టిన ఐదు డిమాండ్లపైనా ఎలాంటి స్పందన లేదన్నారు. చర్చకు ఓకే అంటే నిరసన విరమణకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 600 మందిని అరెస్ట్ చేశారని.. వాళ్లందరూ ఎక్కడికక్కడే శాంతియుత నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు కోదండరాం. నిరసన అనేది రాజ్యాంగ హక్కు అని.. ఏదో విధంగా చేసి తీరతాం అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more