ఏకపక్షంగా వ్యవహరించి పళనిస్వామి ప్రభుత్వం నిలబడేందుకు సహకరించాడంటూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధన్ పాల్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరో విశ్వాస పరీక్షకు రంగం సిద్ధం కాబోతుంది. ప్రతిపక్ష డీఎంకే, పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా స్పీకర్ ధన్పాల్ వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆయనపై విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు.
స్పీకర్ ధన్పాల్పై గవర్నర్కు ఫిర్యాదు చేశామని, ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకొస్తామని తెలిపారు. ధన్పాల్పై అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే సరిపోతుందని అన్నారు. నిబంధనల ప్రకారం రెండు వారాల్లో సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాము కోరినట్టు రహస్య బ్యాలెట్ నిర్వహించి ఉంటే పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని చెబుతున్నాడు. ఇక మాజీ సీఎం జయలలిత మృతిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోవడంతో తమ అనుమానాలు ఇంకా ఉన్నాయంటూ స్టాలిన్ వ్యాఖ్యానించాడు.
234 మంది ఉన్న తమిళనాడు అసెంబ్లీలో శనివారం నిర్వహించిన బలనిరూపణలో 122 అనుకూల ఓట్లతో పళనిస్వామి ప్రభుత్వం విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా నిర్వహించిన విశ్వాస పరీక్ష చెల్లదని పేర్కొంటూ, డీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విశ్వాసపరీక్ష చెల్లదంటూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరింది.
ఓటింగ్ కంటే ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభ్యులను బలవంతంగా మార్షల్స్ చేత గెంటివేయించారని న్యాయస్థానం దృష్టికి డీఎంకే తెచ్చింది. తామంతా రహస్య ఓటింగ్ జరపాలని కోరినా పట్టించుకోలేదని చెబుతూ, ఈ వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించాలని డీఎంకే తరఫున న్యాయవాది మద్రాసు హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్ జి.రమేష్, జస్టిస్ మహదేవన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more