తమిళనాడు అసెంబ్లీలో జరిగిన యాక్షన్ డ్రామాలో కొత్త ట్విస్ట్. ఎడప్పది పళనిస్వామి సీఎంగా బలనిరూపణలో గెలవటంపై అభ్యంతరాలు లేవనెత్తింది డీఎంకే. ఈ మేరకు తమ చొక్కాలు చించి దారుణ అవమానానికి గురి చేశారంటూ గగ్గోలు పెట్టిన ప్రతిపక్ష పార్టీ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
స్పీకర్ దనాపాల్ సభ హక్కులను మంటగలుపుతూ తమకు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించివేసి బలపరీక్ష చేయటం దారుణమని, తాము సీక్రెట్ ఓటింగ్ కు పట్టుబట్టడంతో ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతో పళనిస్వామి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి అసెంబ్లీని రణరంగంగా మార్చాడంటూ ఆరోపించింది. సభ ప్రారంభమైన తర్వాత రెండు సార్లు వాయిదా వేసి, ఆపై తలుపులు మూసి చేయటంతో అనుమానాలు రెకెత్తుతున్నాయంటూ పిటిషన్ లో పేర్కొంది. మంగళవారం ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపటట్టనుండంతో ఏం జరగబోతుందా అన్న టెన్షన్ మరోసారి మొదలైంది.
మరోవైపు అసెంబ్లీలో శనివారం జరిగిన ఘటనపై గవర్నర్ విద్యాసాగర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు స్పీకర్ పై ఫిర్యాదు అందగా, ఏం జరిగిందో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయానికి రాజ్ భవన్ ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క తాము అమ్మను చూసి ఓట్లు వేశామని, సీఎంగా పళనిస్వామి పనికి రాడంటూ గవర్నర్ కార్యాలయానికి విజ్నప్తులు అందుతున్నాయి. ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ పేర్కొంటూ తక్షణమే పళని సర్కార్ ను రద్దు చేయాలంటూ అందులో కోరుతున్నారు.
సుప్రీంలో శశికళ కొత్త పిటిషన్..
ప్రభుత్వానికి తన మార్గదర్శకాలు అందించేందుకు అందుబాటులో ఉండాలని భావిస్తున్న వీకే శశికళ నటరాజన్ అందుకోసం కొత్త ప్యూహాన్ని రచిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక జైల్లో ఉన్న ఆమె తనను తమిళనాడు జైలుకు తరలించాలని ఓ పిటిషన్ మద్రాస్ హైకోర్టులో వేయాలని భావించింది. అయితే హైకోర్టు కాకుండా నేరుగా సుప్రీంకోర్టులోనే వేస్తే ఫలితం ఉండొచ్చన్న భావనకు వచ్చిన ఆమె ఈ మేరకు తన వర్గీయులకు సూచించినట్లు సమాచారం. అనారోగ్యం, అభద్రత కారణాల దృష్ట్యా తనను వెలూరు జైలుకు మార్చాలని అందులో ఆమె కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆమె విషయంలో కాస్త కూడా సానుకూలత చూపని అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more