పాత పెద్ద నోట్ల రద్దును ఎందుకు చేపడుతున్నాం అన్న విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాది నవంబర్ 8న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అంతా తూచ్.. అని అర్బీఐ అనిందా..? అంటే అవుననే సమాధానేలా వస్తున్నాయ్. అవినీతి నిర్మూలణ, నల్లధనం నిర్మూలణ, నకిలీ కరెన్సీ అంతు చూసేందుకే పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని, ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రజలు 50 రోజుల పాటు దేశ హితం కోసం బాధను భరించాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు.. కరెన్సీ రద్దు నేపథ్యంలో ఉగ్రవాదుల వద్దనున్న పాత నోట్లు చెల్లుబాటు కాక.. నిత్యం రావణ కాష్టంలా రగిలే కాశ్మీరంలో కూడా అల్లర్లు చల్లారాయని ప్రధాని అన్నారు. ఇక మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రితో రాజ్ నాధ్ సింగ్ తో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా ఫేక్ కరెన్సీ లేక మావోయిస్టుల కార్యకాలాపాలు కూడా దేశంలో తగ్గుముఖం పట్టాయని అన్నారు. అయితే తాజాగా భారతీయ రిజర్వు బ్యాంకు మాత్రం అసలు దేశంలో నకిలీ కరెన్సీ లేదని.. బ్యాంకుల్లో ఎంత మేరకు వచ్చిందో కూడా తెలియదని మరోమారు చెప్పడం దేశప్రజలను విస్మయానికి గురిచేస్తుంది.
పాత పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో అప్రతిష్టపాలైన ఆర్బీఐ తాజాగా వేసిన పిల్లిమొగ్గపై అటు అర్థిక నిపుణులు కూడా అశ్చర్యం వ్యక్తం చేశారు. నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత రూ.1000, రూ.500 నోట్లలో నకిలీ కరెన్సీని గుర్తించారా? ఎంత మొత్తంలో నకిలీ కరెన్సీ బ్యాంకులకు చేరింది? అనే ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలతో దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది.
సమాచార హక్కు చట్టం ద్వారా ముంబైకి చెందిన అనిల్ గల్గాని అనే కార్యకర్త అడిగి ప్రశ్నలకు బదులిచ్చిన ఆర్బీఐ.. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నకిలీ నోట్ల వివరాలు, వాటికి సంబంధించిన సమాచారమేదీ తన దగ్గర లేదని పేర్కొంది. పాతనోట్లు డిపాజిట్ చేసే క్రమంలో భారీగా నకిలీ కరెన్సీ బ్యాంకులకు చేరిందనే అనుమానాల నేపథ్యంలో అనిల్ ఆర్బీఐ నుంచి సమాచారాన్ని కోరాడు. అంతేకాదు, నోట్ల రద్దు ప్రకటనపైగానీ, దానికి సంబంధించిన ఇతర ప్రశ్నలకు గానీ సమాధానాలు చెప్పబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more