జల్లికట్టు నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. చెన్నయ్, మదురయితో పాటు పలు చోట్ల ఆందోళనకారులు రోడ్ల మీదకు చేరి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. మెరీనా బీచ్ లో ఉన్న జనాలను ఖాళీ చేయించే క్రమంలో చిన్నగా మొదలై క్రమక్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది. కోయంబత్తూరులో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ఆ రాష్ట్ర మంత్రి వెలుమణి, పోలీసు కమిషనర్తో కలిసి అక్కడకు చేరుకోగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చర్చలకు వచ్చిన వారిని చూసిన ఆందోళనకారులు తీవ్రంగా మండిపడ్డారు. వెనుకకు వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తూ వెలుమణి, పోలీసు కమిషనర్ వాహనాలపై రాళ్లతో, కర్రలతో దాడికి దిగారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు టియర్ గ్యాస్, లాఠీ ఛార్జీతో చెల్లాచెదురు చేసి బీచ్ ని ఖాళీ చేయించడంతో తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటాన్ని హింసాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పోలీసుల చర్యలపై తీవ్రంగా మండిపడుతూ వారిపై రాళ్లు రువ్వారు. మెరీన్ బీచ్ సమీపంలో ఉన్న ఐస్ హౌజ్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న పలు పోలీసు, ప్రైవేటు వాహనాలను తగులబెట్టారు. కొందరు ఆందోళన కారులు పెట్రోల్ బాంబులను విసిరినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ ముందు చెలరేగుతున్న మంటలను పోలీసులు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీస్స్టేషన్ ముందు ఉన్న కారు, ఆటో సహా 25 వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో సుమారు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రాపిడ్యాక్షన్ ఫోర్స్ ను అధికారులు రంగంలోకి దించి, ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగం చేశారు. ఆందోళనలతో చెన్నయ్ నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్జాం ఏర్పడింది.
ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. చెన్నయ్ తో పాటు మధురైలో కూడా పోలీసులపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొందరు యువత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీలో జల్లికట్టు ఆర్డినెన్స్ బిల్లు అయి తీరుతుందన్న నమ్మకాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ ప్రకటించాడు.
వ్యతిరేకంగా పిటిషన్...
జల్లికట్టుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి మేనకా గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జల్లికట్టులో జంతువులను హింసిస్తారని తన పిటిషన్లో పేర్కొంది. జల్లికట్టును పూర్తిగా నిషేదించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
అమెరికాలో కూడా...
మద్దతుగా ఇప్పుడు అమెరికాలో కూడా వందల సంఖ్యలో తమిళులు ఆందోళనకు దిగారు. అమెరికాలో ఉంటున్న తమిళులు ఈ రోజు వాషింగ్టన్లోని భారత ఎంబసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన ప్రదర్శనకు దిగారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. మరోవైపు వర్జీనియాలోని నార్ఫోక్లో పెటా హెడ్క్వార్టర్స్ ఎదుట కూడా తమిళులు నిరసన తెలిపారు. పెటాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more