నిషేధం ఎత్తేసేందుకు ఆర్టినెన్స్ తెస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మరోవైపు సీఎం సమక్షంలో అట్టహాసంగా మొదలైన జల్లికట్టుతో ఇద్దరి ప్రాణాలు పోయాయి కూడా. అయినా చెన్నైలోని మెరీనాబీచ్ వద్ద మాత్రం ఆందోళన విరమించే ప్రసక్తే లేదని నిరసనకారులు చెబుతున్నారు. జల్లికట్టుపై ఉన్న నిషేధం శాశ్వతంగా ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున్న యువత నినాదాలతో సాగర తీరం మారు మోగిపోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళన చేస్తున్న వారితో మెరీనా బీచ్ చుట్టుపక్కల దారులన్నీ మూసుకుపోయి రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సుమారు నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనటం, పైగా రిపబ్లిక్ డే దగ్గర పడుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు రెండు రోజులుగా చెబుతున్నారు. అయినా వినకపోవటంతో లాభం లేదని పోలీసులు రంగంలోకి దిగిపోయారు. బలవంతంగా వారిని ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టియర్ గ్యాస్, స్వల్ఫ లాఠీ ఛార్జి ప్రయోగం చేయటంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆ ప్రాంతం నుంచి తమను ఖాళీ చేయించాలని చూస్తే సముద్రంలో దూకుతామంటూ విద్యార్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. జల్లికట్టుకు ఆర్డినెన్స్తో సరిపుచ్చడం సరికాదని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు.
విద్యార్థుల బెదిరింపులతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వారిని అక్కడి నుంచి పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. మరోపక్క ఆర్డినెన్స్ పై చర్చించేందుకు తమిళనాడు అసెంబ్లీ సోమవారం నుంచి ప్రత్యేకంగా సమావేశం కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more