తమ సంస్కృతిలో భాగమైన ఒక క్రీడ కోసం తమిళులు సాగించిన పోరాటమే ఆంధ్రులకు మరోమారు నిదర్శనంగా నిలిచిందిని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపి రామచంద్రరావు అన్నారు. తమిళ సోదరుల జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉద్యమించాల్సిన అవశ్యకత వుందన్నారు. అటు తమిళులు జల్లికట్టు ఉద్యమానికి ఐదు రోజుల్లోనే కేంద్రం దిగివచ్చి వారి డిమాండ్లను అంగీకరిస్తూ అర్డినెన్సును జారీ చేసిందని.. ఈ పోరాటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అదర్శంగా నిలివాలని కోరారు.
ఆంద్రప్రదేశ్ లోని అన్ని వర్గాలు, కుల, మత, ప్రాంతాలతో పాటు రాజకీయాలకు, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖలందరూ కలసి కట్టుగా నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించి పోరాడాలని సూచించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతామని, భవిష్యత్ తీరాలకు తీరని నష్టం చేసిన వారం అవుతామని చెప్పారు.
చట్టవిరుద్ధమైన జల్లికట్టునే తమిళులు సాధించుకున్నారని, అలాంటిది ఎన్నికల ముందు పలు పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని హామీలను కూడా ఇచ్చాయిని, అధికారంలోకి వచ్చిన అవే పార్టీలు ఇప్పుడు మాటమార్చి ప్రత్యక హోదాను ప్యాకేజీతో ముడిపెట్టాయన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామన్న చట్టబద్ధమైన హామీని ఎందుకు సాధించుకోలేమని కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more