పాత పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. అర్బీఐ అమలుపరుస్తున్న విధానాలు పలువురు దేశ ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గతేడాది నవంబర్ ఎనమిదిన చేసిన ప్రకటనకు.. వాస్తవికంగా పలువురు ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితికి అసలు పొంతనే లేకుండా పోయింది. తన వద్దనున్న నాలుగు వేల రూపాయల పాతనోట్ల కోసం ఢిల్లీలోని అర్బీఐ కార్యాలయం ఎదుటు ఓ మహిళ తన వలువలను విప్పి.. వినూతన్న రీతిలో నిరసన తెలిపినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
తాజాగా చనిపోయిన తన తండ్రి విడిచి వెళ్లిన పాత నోట్లను వారసులు బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసే ప్రయత్నాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్డుకుంది. మార్చి 31 వరకు రద్దు చేసిన పాత పెద్ద నోట్లను డిఫాజిట్ చేసుకోవచ్చని ఓ వైపు కేంద్ర అర్థిక శాఖ చెబుతూనే.. మరోపక్కా తిరస్కరించడం ఏంటిన బంధువులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు ఆర్బీఐ అధికారులు చెబుతున్న వివరణ మాత్రం ఢిఫరెంట్ గా వుంది. ప్రస్తుతం ఎన్ఆర్ఐలకు సంబంధించిన నోట్లను మాత్రమే జమ చేసుకుంటున్నామని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. భోపాల్కు చెందిన శివ్చారన్ సింగ్ మారన్ (93) అనే పెద్దాయన గత ఏడాది (2016) డిసెంబర్ 26న తీవ్ర అనారోగ్యానికిలోనై చనిపోయాడు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు ఇటీవలె ఇల్లును శుభ్రం చేసే పనులు మొదలుపెట్టారు. పాత సామానంత బయటపడేసే క్రమంలో తండ్రి గదిలోని ఓ సొరుగులో రూ.50వేలు పాత ఐదువందల నోట్లలో లభ్యం అయ్యాయి. దీంతో ఈ నోట్లను తీసుకున్న అయన కొడుకు వాటిని డిఫాజిట్ చేయడానికి అర్బీఐ కార్యాలయానికి వెళ్లగా అధికారులు తిరస్కరించారు.
93 ఏళ్ల తండ్రి జ్ఞాపకశక్తిని కోల్పోవడం వల్లే ఆ డబ్బు వివరాలు ఎవరికీ చెప్పలేదని, కాగా ఇంటిని శుభ్రం చేస్తుండగా దోరికిన సొమ్మును డిపాజిట్ చేయడానికి వచ్చామని శివ్ ధారన్ సింగ్ మారన్ తనయుడు అర్బీఐ అధికారులకు వివరణ ఇచ్చాడు. అంతేకాదు తన తండ్రి మరణానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, అతడి ఆరోగ్యం వివరాలకు సంబంధించిన పత్రాలు చూపించారు. అయినా అధికారులు పాత నోట్లను తీసుకుని వాటిని అకౌంట్లో జమచేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐలకు మాత్రమే నగదు మార్పిడి చేస్తున్నామని అధికారులు చెప్పడంతో చేసేదిలేక వెనుదిరిగాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more