డిమోనిటైజేషన్ పై కేంద్రమంత్రులు ఒకలా స్పందిస్తే.. కేంద్రప్రభుత్వానికి మిత్రపక్షంగా వున్న శివసేన మరోలా స్పందించింది. పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక విప్లవమని కేంద్రమంత్రులు ఎం జె అక్బర్, బండారు దత్తాత్రేయ అనగా, ఆ నిర్ణయం దేశ అర్థిక వ్యవస్థపై అణుబాంబు వేసినట్లేనని శివసేన ప్రధాని నరేంద్రమోడీని, ఆయన నిర్ణయాన్ని ఘాటుగా విమర్శించింది. జన్ ధన్ ఖాతాలతో లాభం ఏంటో ఇప్పుడు తెలిసిందన్నారు. ప్రతి పేదవాడు ఇపుడు తమ అకౌంట్స్ ద్వారా పేమెంట్ చేస్తున్నారని అక్బర్ అన్నారు.
నిరక్షరాస్యులు కూడా ఫింగర్ ప్రింట్ ద్వారానే లావాదేవీలు నడిపేంత సులువుగా డిజిటల్ ట్రాన్సక్షన్స్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. డిజిటల్ పేమెంట్ ద్వారా పారదర్శకత పెరిగి అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ డిమోనిటైజేషన్ ని వ్యతిరేకించడం అర్థ రహితమన్నారు. అవినీతి పరులకు కొమ్ము కాచే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇదిలా వుండగా బీజేపి మిత్రపక్షం శివసేన మాత్రం ప్రధాని మోడీ నిర్ణయంపై ఘాటుగా మండిపడింది.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రెండో ప్రపంచ యుద్ద సందర్భంగా అమెరికా సేనలు జపాన్ లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే అధిక ప్రభావాన్ని దేశ అర్థిక వ్యవస్థపై చూపాయని మండిపడింది. మోదీ నిర్ణయంతో భారతీయులంతా బలయ్యారని శివసేన తమ అధికార పత్రిక సామ్నా ద్వారా విమర్శించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకునే పరిణామాలను రిజర్వ్ బ్యాంక్ చెప్పినప్పటికీ మోదీ వినలేదని అరోపించింది. చెవిటి, మూగ రామచిలుకలాంటి కేంద్రమంత్రులు, ఉర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించారని విమర్శించారు. మోదీ తీసుకున్న తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more