మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడిచే బ్లడ్ బ్యాంకు కోసం రక్త సేకరణ కార్యక్రమం భారీ ఎత్తులో జరగనుంది. అయితే అది ఒక్క ఈ బ్లడ్ బ్యాంకుకే పరిమితం కాదు. ఇంతకీ ఇది నిర్వహిస్తోంది ఎవరో తెలుసా?. తెలుగుదేశం పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్’ పేరుతో బుధవారం భారీ రక్తదాన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి తెలిపారు.
జనవరి 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టనున్నారంట. తెలుగువారి హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రక్తదానం నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో 145 చోట్ల ఇదే సందర్భంలో రక్తదాన శిబిరాలు విజయవంతంగా నిర్వహించామని, ఆ స్పూర్తితో ఈసారి మరిన్ని చోట్ల నిర్వహించాలని ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
ఇక ట్రస్టు సీఈవో టి.విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ఈ భారీ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు రక్తనిధితోపాటు చిరంజీవి రక్తనిధి, రెడ్క్రాస్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు, ఆరోహి, ఇతర రక్తనిధి సంస్ధలు పాల్గొంటున్నాయన్నారు. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భువనేశ్వరి, బ్రహ్మణి ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సిద్ధార్థ మేనేజ్మెంట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more