పశ్చిమ బెంగాల్లో కేంద్ర, రాష్ట్రల్లో అధికారంలో వున్న పార్టీల మధ్య రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. రోజ్వ్యాలీ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ను సీబీఐ అరెస్టు చేసింది. ఐదు రోజుల వ్యవధిలో టీఎంసీ ఎంపీ తపస్ పాల్ను ఇదే కుంభకోణంలో అరెస్టు చేసి సీబీఐ తరువాత సుదీప్ బదోపాధ్యయను కూడా అరెస్టు చేసింది.
ఈ అరెస్టులపై టీఎంసీ విద్యార్థి విభాగం తీవ్ర అగ్రహంతో మండిపోయింది. అరెస్టులకు నిరసనగా ఆందోళనకు దిగింది. కోల్కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ను సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇటీవల సమన్లు జారీ చేసిన సీబీఐ ఈ రోజు సుదీప్ను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. రోజ్ వ్యాలీ కంపెనీలో తపస్ పాల్ డైరెక్టర్గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి.
తృణముల్ నేతలందర్నీ జైల్లో పెట్టినా.. నోట్లరద్దు అగదు
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎంపీలను వారం వ్యవధిలో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత తృణమూల్ కాంగ్రెస్ను రద్దు చేయాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ్, తపస్ పాల్లను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు. 'మోదీకి ఛాలెంజ్ చేస్తున్నా, మా పార్టీ నేతలను అరెస్ట్ చేయిస్తే పారిపోతారని మీరు భావిస్తున్నారేమో, మేం భయపడేది లేదు' అని మమత అన్నారు.
పార్టీ ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్కతాలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని మమత చెప్పారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రిజర్వ్ బ్యాంకు కార్యాలయం ఎదుట ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిరసన తెలియజేస్తామన్నారు. అలాగే 10 రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు. ఈ విషయంలో తాను చట్టబద్ధమైన పోరాటం చేస్తానని, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని ఆమె అంటున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోట్లాది మంది చిన్న పెట్టుబడిదారులను మోసం చేసి రూ. 17వేల కోట్ల కుంభకోణానికి రోజ్వ్యాలీ చిట్ఫండ్ సంస్థ పాల్పడిందని, ఈ వ్యవహారంలో అధికార టీఎంసీ నేతల ప్రమేయం కూడా ఉందని సీబీఐ పేర్కొంటున్నది.
Will protest outside RBI Kolkata on 9th January, and on 10th and 11th January in Delhi: Mamata Banerjee,West Bengal CM #DeMonetisation pic.twitter.com/zB1LrmLvC2
— ANI (@ANI_news) January 3, 2017
I challenge PM, he cannot do anything, can't suppress the voice of the people: Mamata Banerjee,West Bengal CM pic.twitter.com/mHSLr8ZpJ1
— ANI (@ANI_news) January 3, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more