భారత దేశం అంటే విభిన్నమైన సంస్కృతీ. సంప్రదాయాలకు నెలవని.. ఆ దేశంలో పర్యటిస్తే.. అహ్లాదంతో పాటు అధ్మాత్మికత, ప్రశాంతత లభిస్తుందని ఎందరెందరో విదేశీయులు మన దేశ పర్యటనకు వస్తున్నారు. కాగా, దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలతో విదేశాలు భారత పర్యటన అంత సురక్షితం కాదని కూడా తమ దేశస్థులకు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి కూడా వచ్చింది. గత కొన్నాళ్లుగా దేశపర్యటనకు వస్తున్న విదేశీవనితలపై జరుగుతున్న అత్యాచారాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఇక మరోకారణం కేసుల దర్యాప్తు కూడా నత్తనడకన సాగడం.
గత ఏప్రిల్ మాసంలో దేశపర్యటనకు వచ్చి ఢిల్లీలోని కనౌట్ ప్లేస్ ప్రాంతంలోని ఐదు నక్షత్రాల హోటల్ గదిలో దిగిన తనపై తన టూరిస్టు గైడ్, బస్సు డ్రైవర్, కండక్టర్, హోటల్ రూమ్ బాయ్ లు కలసి సామూహిక అత్యాచారం చేశారని అగ్రరాజ్యం అమెరికాకు చెందిన బాధితురాలు తెలిపింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు చూపించిన గైడు మొదట్లో తనతో స్నేహంగా ఉండేవాడని దాంతో అతడ్ని తన హోటల్ గదిలోకి రాణించేందుకు తాను అనుమతించానని చెప్పింది.
అదే అదనుగా తీసుకున్న గైడ్.. ఏప్రిల్ 8న మర్నాటి కార్యక్రమం గురించి మాట్లాడే నెపంతో తన స్నేహితులతో కలిసి రూంలోకి వచ్చి, మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి తనను రెండు రోజులకు పైగా శారీరికంగా దారుణంగా అనుభవించారని తన పిర్యాదులో పేర్కోంది. ఒకరి తర్వాత ఒకరుగా తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. అత్యాచార విషయం ఎక్కడైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారని చెప్పింది. నిందితుల వద్ద అత్యాచారానికి సంబంధించిన వీడియో కూడా ఉన్నట్లు ఆమె ఆరోపించింది.
దీంతో బెదిరిపోయిన బాధితురాలు.. తన స్వదేశానికి పయనమైంది. అక్కడ ఓ ఎన్జీఓ సంస్థ సహకారంలో భారత్ తిరిగోచ్చి తనపై జరిగిన అత్యాచారంపై పోలీసులకు అక్టోబర్ లో పిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తును చేపట్టిన ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అత్యాచార ఘటన పిర్యాదు అక్టోబర్ లో అందినా.. డిసెంబర్ 3న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక బాధితురాలు ఢిల్లీ పోలీసుల కేసు దర్యాప్తుపై మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాలకు సంబంధించిన వారిన దేశ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో వారి రక్షణ కు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే సముచితంగా వుంటుందని అమె అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more