స్నేహితులతో కలసి మీ కారులో హాలీడే ట్రిప్ వెళ్ధామని ప్లాన్ చేసుకున్నారా..? దారి వెంట వెళ్తూ వెళ్తూ కాస్తా చిల్ అవుదామని అనుకుంటున్నారా..? మార్గమధ్యంలో మీ తెలిసిన బార్ వుందా..? అయినా ఇక మీ ఎంజాయ్ మెంట్ కు చీటీ చెల్లనుంది. రోడ్డు ప్రమాదాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలను తీసుకోని తరుణంలో వాటిపై అప్రమత్తంగా వుండాలని అదేశించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక అదేశాలను జారీ చేసింది.
మద్యం దుకాణాలను కేవలం అదాయ వనురుగానే చూసే రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టులా పరిణమించనుంది. ప్రజారోగ్యం, ప్రమాదాల నివారణ నేపథ్యంలో న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు అదాయాన్ని కొంతమేరకు హరించే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుతో ఇకపై జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వున్న మద్యం దుకాణాలు, బార్ షాపులను తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం అదేశాలను జారీ చేసింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న షాపుల లైసెన్సులను రెన్యూవల్ చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది. జాతీయ, రాష్ట్రాల హైవేలకు మద్యం షాపులు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది. హైవేల పక్కన మద్యం అమ్మకాల వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మద్యం షాపులను మూసివేయాలని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more