నవంబర్ 8న పెద్దనోట్లు రద్దు చేసి ఇవాళ్టికి 30 రోజులు కావస్తున్నా.. ప్రధాని నరేంద్రమోడీ అడిగిన 50 రోజుల సమయంలో సగానికి కంటే ఎక్కువ సమయం గడిచిపోయినా.. దేశంలోని సామాన్యులకు మాత్రం 11వ రోజు ఏర్పడిన పరిస్థితులే ఇంకా ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, అర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలు పదే పదే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తనోట్లను పంఫిణీ చేస్తామని, కొత్త 500 రూపాయల నోట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని ప్రకటనలు గుప్పిస్తున్నా.. పరిస్థితుల్లో మాత్రం మార్పు కానరావడం లేదు.
ప్రధాని నోట్ల రద్దు ప్రకటన చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెరుచుకోని ఏటీయం కేంద్రాలు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోనే వున్నాయి. కేంద్ర పెద్దలు, అధికారుల ప్రకటనలు వెలువడినప్పుడల్లా ఇక్కడకు వచ్చి.. ఇప్పుడైనా తెరుచుకుంటాయా..? అని అశగా ఎదురు చూసిన కస్టమర్లకు నిరుపయోగంగా మారిని ఏటీయం మిషన్లు వెక్కిరిస్తూ వెటకారంగా నవ్వుకుంటున్నాయి. ప్రకటన వచ్చిన తరువాత పర్వాలేదనిపించిన ఏటీయం కేంద్రాలు.. అప్పటి నుంచి ఒకటి రెండు వారాలు ఇబ్బందులకు గురిచేశాయి. ఇక డిసెంబర్ 1 రావడానికి ముందే షెటర్లు వేసేసుకున్నాయి.
ఇక ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఇది నిజంగా చేదు వార్తే. వరుసగా మూడు రోజులు బ్యాంకుల సెలవులతో మరిన్ని కష్టాలు రానున్నాయి. వచ్చే శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాదారణ సెలవు, సోమవారం మహ్మదీయుల ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే షిల్లార్-ఉల్-నబీ పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. దీంతో ఇప్పటికే కరెన్సీ కష్టాలతో మూలుగుతున్న ప్రజలపై బ్యాంకుల వరుస సెలవులు తాటికాయను పడేశాయి.
బంగారు భవిష్యత్తు కోసం కొంత బాధనైనా భరిచేందుకు సిద్దమైన సామాన్యులకు మూడు పదుల రోజులు గడుస్తున్నా ఇంకా ఎండమావులే కనబడుతున్నాయి. 30 రోజులు పూర్తి అయినప్పటికీ కరెన్సీ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. గోరుచుట్టుపై రోకలి పోటు చందాన బ్యాంకులకు వరుస సెలవులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఏటీఎంలు 90 శాతం పై బడి పనిచేయడం లేదు. ఈ పరిస్థితులల్లో మూడు రోజుల పాటు బ్యాంకులూ లేక, ఏటీఎంలు పనిచేయక కరెన్సీ కష్టాలు ఎలా తీరుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురు,శుక్రవారాల్లోనైనా బ్యాంకుల నుంచి సరిపడ చెల్లింపులు ఇవ్వాలని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more