దేశం నుంచి అవినీతి, నల్లధనాన్ని తరమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు చారిత్రక నిర్ణయమని అభివర్ణించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ఈ నిర్ణయం అమలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగుదు కొరత సంక్షోభం నెలకొందని, అయితే ఇది తాత్కాలికంగానే వుంటుందని అయన అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, కితాబిచ్చిన ఆయన ప్రధాని మోడీ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. దీర్ఘకాలంలో పెద్ద నోట్ల రద్దు దేశా అర్థిక ప్రగతికి దోహధపడుతుందని అన్నారు.
పెద్దనోట్ల స్థానంలో కొత్త కరెన్సీ పూర్తిగా చెలామణిలోకి రావడానికి కొంత సమయం పడుతుందని, ఈ పరివర్తన సమయంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు, అవస్థలు పడక తప్పదన్నారు. పెట్రోటెక్ 2016 సమావేశంలోఆర్థిక మంత్రి ప్రసంగిస్తూ.. గత ఏడు దశాబ్ధాలుగా వున్న కరెన్సీ సాధరణ పరిస్థితిని కొనసాగించేందుకు బదులు ప్రధాని మోడీ పెద్ద నోట్లు రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకుని కొత్త సాధరణ పరిస్థితికి తీసుకురావాలని అకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని ఈ నిర్ణయాన్ని తీసుకుని పర్యవసానాలన్నింటినీ తన భుజాతపైనే వేసుకున్నారని, ఇది దేశహితాన్ని కాంక్షించే వారికే సాధ్యమని ప్రధానిపై ప్రశంసలు కురిపించారు.
క్యాష్ లెస్ ఎకానమీ దిశగా భారత్ ను నడిపించే క్రమంలో.. దేశం యావత్తు డిజిటల్ వైపు అకర్షితులవుతున్న నేపథ్యంలో సామాన్యులకు కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. ప్రజల అవస్థలను అర్థం చేసుకుని వాటిని అధిగమించేందుకు ప్రతి రోజు ఆర్ బీఐ కొంత కరెన్సీ కొంత మొత్తాన్ని విడుదల చేస్తోందని వివరించారు. స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులు వున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరనున్నాయన్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం ఆర్థిక వృద్దిగా దన్నుగా నిలుస్తుందని జైట్లీ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more