వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి అధికార పక్షాన్ని టార్గెట్ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ప్రతిపక్షం నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో రోజా సీఎం చంద్రబాబు, తనయుడు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. యువకుడైన వైయస్ జగన్ ముందు నలబై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు తేలిపోతున్నాడని, రాజకీయంగా బాబు ముసలోడు అయిపోయాడని వ్యాఖ్యానించింది. అందుకే ఇంగిత జ్నానం లేకుండా విశాఖ బీచ్లో బికినీ షోలు అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు.
ఇక ఏపీలో ప్రతిపక్షం లేదంటూ నారా లోకేష్ చేస్తున్న కామెంట్లపైనా ఘాటుగానే రోజా కౌంటర్ ఇచ్చింది. లోకేష్ మాటలు చూస్తుంటే, అవగాహనా రాహిత్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతుందన్న రోజా, లోకేష్ కామెడీ ఆర్టిస్టుకు ఎక్కువ, కామెడీ విలన్కు తక్కువ అంటోంది. మండల కమిటీ కూడా తెలియని లోకేష్ వైసీపీ గురించి, జగన్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని తెలిపింది. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ప్రకటించాం. మీకు ఆ దమ్ము ఉందా? అసలు మా పార్టీలోంచి లాక్కున్న వారిని తిరిగి గెలిపించుకునే సత్తా ఉందా అంటూ ఫైరయ్యింది రోజా. వెన్నుపోటు బ్రదర్స్(బాబు, వెంకయ్య నాయుడులను ఉద్ధేశించి) ఇద్దరూ ఐదు కోట్ల మందిని మోసం చేస్తున్నారని, వీరి ఆటలు కట్టించేందుకు వైసీపీ రంగంలోకి దిగిందని పేర్కొంది.
ఇక విశాఖ ఉద్యమాల పురిటిగడ్డ అని అందుకే జగనన్న ఇక్కడి నుంచి హోదా కోసం ఉద్యమిస్తున్నారని చెప్పింది. హోదా అనేది ఐదు కోట్ల ఆంధ్రుల తల రాత మార్చే సంజీవిని, ఇది రాష్ట్ర ప్రజలకు, భవిష్యత్తు తరాలకు తారక మంత్రం, తద్వారానే పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. వైసీపీ రంగంలోకి దిగేసరికి టీడీపీ మంత్రులు, నేతల వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే ఏం మాట్లాడాలో తెలీక విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారని మండిపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more