అన్నిదానాల్లో కెల్లా అవయవదానం చాలా ముఖ్యమని ఈ మధ్య తరచూ మనం వింటున్నాం. ముఖ్యంగా ప్రాణం పోయినా మరికొందరి ప్రాణాలను నిలపటం కన్నా గొప్ప ఇంకేముంటుంది చెప్పండి. అయితే ఇక్కడ ఓ వ్యక్తి ఎదుటి మనిషి ప్రాణం నిలపటమే కాదు, సదరు వ్యక్తి మనసును కూడా కొట్టేశాడు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న యువతికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఓ యువకుడు దానం చేశాడు. ప్రతీగా ఆ యువతి తన హృదయాన్ని(గుండెను కాదు మనసును) అతనికి ఇచ్చింది.
అమెరికాలోని ఇల్లినాయిస్కి చెందిన ఫ్రాన్స్ఫోర్ట్లో ఉండే హెదర్ క్రూగర్ అనే యువతికి రెండేళ్ల క్రితం తన కాలేయం పాడైపోయిందని వైద్యుల ద్వారా తెలుసుకుంది. ఆమె బతకాలంటే దాతలు ఎవరైనా కాలేయం దానమివ్వాల్సిందేనని వైద్యులు చెప్పారు. ఊహించని విధంగా షాక్కు గురైన ఆమె దాతల కోసం వెతికి వెతికీ వెతికీ విసిగిపోయింది. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఇంకా కొద్ది నెలలే అని డాక్టర్లు చెప్పటంతో ప్రాణాల మీద ఆశలు సైతం వదిలేసుకుంది.
అయితే అదే సమయంలో క్రిస్ డింప్సే ఆపద్భాందవుడిలా వచ్చాడు. కాలేయం దానం చేసి ఆమెకు సాయపడతానని చెప్పాడు. వైద్యులు అతడికి టెస్టులు చేసి అతని కాలేయం ఆమెకి సరిగ్గా సరిపోతుందని గుర్తించారు. గతేడాది మార్చిలో శస్త్రచికిత్స చేసి ఆ యువకుడి కాలేయంలో కొంతభాగాన్ని సదరు యువతికి అమర్చారు. ఈ నేపథ్యంలోనే క్రిప్స్, క్రిస్ మధ్య స్నేహ ఏర్పడింది. అది ముదిరి ప్రేమగా మారింది. ఇంకెందుకని ఈ మధ్యే ఏకంగా పెళ్లి చేసేసుకున్నారు.
తాను హెదర్ పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఆమె స్థితిలో తన కుటుంబ సభ్యులే ఉన్నట్లుగా భావించానని క్రిస్ చెప్పాడు. అందుకే పెద్దగా పరిచయం లేకున్నా కాలేయం ఇచ్చానని పేర్కొన్నాడు. కొత్త పెళ్లికూతురు హెదర్ మాట్లాడుతూ... తనకు తెలిసినంతవరకు క్రిస్ ఒక గొప్ప వ్యక్తి అని చెప్పింది. క్రిస్ తన మీద నమ్మకాన్ని ఉంచాడని పేర్కొంది. ఇప్పుడు తాను నవ్వుతూ అందరి మధ్యలో ఉన్నానని చెప్పింది. మొత్తానికి కాలేయం అలా ఆ రెండు హృదయాలను కలిపింది. ఇది రియల్ హృదయ కాలేయం స్టోరీ... బావుంది కదా!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more