భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ- ఉప రాష్ర్టపతి హమిద్ అన్సారీలకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పండగ పర్వదినం నేపథ్యంలో తీపికబరును అందించనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి పండగను పురస్కరించుకుని వారికి కానుకలను అందించనుంది. అదేంటి కానుక, అంటే.. వారి వేతనాలను భారీగా పెంచనుంది. ఔనా..! అంటూ నోరు వెళ్లబెట్టకండీ.. ఎందుకంటే మేం చెప్పేది వింటే మళ్లీ అదే చేయాల్సివస్తుంది. ఏకంగా మూడు వందల రెట్లకు పైగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల వేతనాలు పెరగనున్నాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు పర్చిన ఏడవ వేతన సంఘం సిఫార్సులతో క్యాబినెట్ కార్యదర్శకి రమారమి రెండున్నర లక్షల రూపాలయ వేతనాన్ని అందుకుంటుంన్న నేపథ్యంలో అది భారత రాష్ట్రపతి వేతనం కన్నా సుమారు లక్ష రూపాయలు అధికంగా వుండడం వల్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు వేతనాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను ఇప్పటికే సిద్ధం చేసింది.
దీంతో లక్షన్నర రూపాయల నెలసరి వేతనం వున్న రాష్ట్రపతికి ఏకంగా ఐదు లక్షలు, లక్షా పది వేల రూపాయల నెలసరి వేతనం వున్న ఉప రాష్ర్టపతికి మూడున్నర లక్షల రూపాయలుగా ప్రతిపాదించారు. రానున్న శీతాకాల సార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును అమోదించాలని కేంద్రం భావిస్తుంది. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ర్రపతి - ఉపరాష్ర్టపతులిద్దరికీ పెంచిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. చివరగా 2008లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల వేతనాలను పెంచిన విషయం పాఠకులకు విధితమే. అయితే రిటైర్మెంటు తరువాత రాష్ట్రపతికి లక్షన్నర రూపాయల పెన్షన్ రాగా, అయన సతీమణికి సుమారు 30 వేల రూపాయల సెక్రటేరియల్ అసిస్టెన్స్ వస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more