యూరీ ఎటాక్ లో తమ ప్రమేయం లేదంటూ వాదిస్తూ వస్తున్న పాక్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. సైనిక స్థావరంపై దాడి చేసింది ఎల్ఈటీ (లష్కరే తాయిబా) ఉగ్రవాదులే అన్న పచ్చి నిజం ఇప్పుడు బట్టబయలైంది. పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలాలో నడిరోడ్డుపై వెలిసిన పోస్టర్లే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దాడిలో భారత సైనికుల చేతిలో హతమైన నలుగురు ఉగ్రవాదులలో ఒకడైనా మహ్మద్ అనాస్ అలియాస్ అబూ సిరాఖా అంత్యక్రియల సందర్భంగా స్వస్థలం బాదానుల్లాలో నిర్వహించే ప్రత్యేక నమాజ్ కు హాజరు కావాలని స్థానికులను ఆహ్వానిస్తూ సందేశంతో ఆ పోస్టర్లు వెలిశాయి. పోరాట యోధుడైన అబూ సిరాఖా యూరీ క్యాంపులోని 177 మంది హిందూ సైనికులను నరకానికి పంపాడని (వాస్తవానికి ఉరీ దాడిలో 20 మంది సైనికులే మరణించారు), మతం కోసం ప్రాణ త్యాగం చేశాడని పోస్టర్ పై పేర్కొన్నారు.
పంజాబ్ ప్రొవిన్స్ లోని గార్ జాఖ్ సమీపంలోని బాదానుల్లా ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నమని, అబూ మృతదేహం లేకుండానే అంత్యక్రియలు జరుపుతున్నామని తెలిపారు. అంతేకాదు అబూ సిరాఖా ఫొటోనే కాకుండా, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఫొటోను కూడా ఉంచారు. ఈ వార్తను ఓ ప్రముఖ జాతీయ పత్రిక ధృవీకరించగా, ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మరోవైపు, యూరీ దాడి జరిగిన వెంటనే... అది జైషే మొహమ్మద్ పనేనని భారత్ ఆరోపించింది. అయితే, తాజా పోస్టర్లతో ఆ దాడులకు పాల్పడించి లష్కరే తాయిబా అనే విషయం వెల్లడైంది. ఈ పోస్టర్లతో, ఉరీ ఉగ్రదాడి లష్కరే తాయిబా పనే అనే విషయం తేటతెల్లమైంది. కాగా, ఉగ్రదాడితో ఇప్పటిదాకా తమకు సంబంధం లేదని చెబుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పుడేం చెబుతారో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more