ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందన్నది నిజం. ప్రతీ చిన్న విషయానికి అందోళన చెందేవారు.. తరున్ అశ్వినీకి ఎదురైన షాకింగ్ ఘటనను ఎదుర్కోంటే భాయందోళనకు గురికాక మానరు. తమ మానాన తమను వదిలేయమని బతిమాలుతూ అందుకు ఎంతో కోంత ధనమో, దస్కమో సమర్పించుకుంటారు. లేక వారికి లోంగిపోతారు. అది కాకపోతే.. పరుపు పోయిందని ప్రాణాలను తృణప్రాయంగా తీసుకుంటారు. అయితే ఈ ఆమ్మాయి ఏం చేసింది. ఎలా బుద్ది చెప్పిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమె ధైర్యాన్ని అభినందిస్తూ ప్రశంసలు కూడా వెల్లివిరుస్తున్నాయి. అంతలా అమె చేసిందేమిటీ.. అంటే వివరాల్లోకి వెళ్లక తప్పదు.
భారత్ దేశం ముంబైలోని జుహూకు చెందిన అమ్మాయి తరుణ అశ్విని.. ప్రస్తుతం అమెరికాలో ఫిజియోధెరఫీ నిఫుణురాలిగా కొనసాగుతుంది. తనకు గత శుక్రవారం రాత్రి 8.59 గంటలకు ఓ ఈమెయిల్ వచ్చింది. ‘నా దగ్గర నీ నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. నువ్వు పంపిన వ్యక్తితో పాటు అవి నా వద్ద కూడా వున్నాయి.. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను తృప్తి పరచాలి. నేను చెప్పినట్టు నగ్నంగా ఫొటోలు, వీడియోలు పంపించాలి’ అన్నది ఈమెయిల్ సారాంశం.
ఆ తర్వాత కాసేపటికే తనవి ఉత్త బెదిరింపులు కాదని హెచ్చరించడానికి ఆమె నగ్నఫొటోలను కూడా పంపి మరింత భయపెట్టాడు. అప్పటి వరకు అవి కేవలం బెదిరింపులే అని భావించిన అశ్వనీకి తన ఫోటోలు చూడటంతో కలవరానికి గురిచేసింది. వాడు అన్నంత పనిచేస్తే.. తన పరువుమర్యాదలు ఏం కావాలని..? తన మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. అయితే వాడి బెదిరింపులకు లొంగకూడదని కృతనిశ్చయంతో వున్న అమెకు ఒక్క ఐడియా తట్టింది. అంతే ఐడియా ప్రకారం ముందుకెళ్లింది. అదేంటంటారా..?
తన ఐడియా ప్రకారం బ్లాక్ మెయిలర్ బెదిరింపులను బహిరంగపరచింది. వాడు పంపిన రెండు ఈయిళ్లను స్ర్కీన్షాట్స్ తీసి ఆమె తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. సైబర్ నేరగాడి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. పలువురు అమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మరికోందరు మాత్రం.. అలాంటి ఫొటోలు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఆమె ప్రియుడు, పోలాండ్ జాతీయుడైన స్టాస్ ఈస్ట్కో కూడా ఈ విమర్శలను తప్పుబట్టడంతో అమెకు కొండంత బలం వచ్చిచేరింది. తనకు ఆన్లైన్ బెదిరింపులు, బ్లాక్ మెయిలర్ ఈ మెయిల్స్ రావడంపై అమెరికాలోని మేరీల్యాండ్ పోలీసులు, ఎఫ్బీఐ దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదని తరుణ్ అశ్విని తెలిపారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more